రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం అదేవిధంగా ప్రాజెక్టు టెండర్ల విషయంలో ప్రపంచబ్యాంకు నిబంధనల ఆధారిత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణ బాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఎవరైనా భౌతిక దాడులకు పాల్పడితే కచ్చితంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. టెండర్ల విషయంలో చాలా కంపెనీలకు అర్హతలు ఉన్న 14 కంపెనీలే టెండర్ వేయడానికి గల కారణం గురించి తెలుసుకో బోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టెండర్లకు చాలా తక్కువ స్పందన వచ్చినందున రిటెండరింగ్ కు వెళ్తున్నామని కృష్ణ బాబు పేర్కొన్నారు.
దీంతో టెండర్ల విషయంలో చాలా అవకతవకలు జరిగినట్లు జగన్ ప్రభుత్వం గుర్తించి…..గతంలో వేసిన టెండర్లను రద్దు చేసి మరలా టెండర్ కి వెళ్లాలని జగన్ ఆదేశించడం జరిగింది. ఇదే విషయాన్ని రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ పొరపాటు అయినందువలన క్యాన్సల్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు నియమాల ప్రకారం గత రెండు సంవత్సరాలలో ఒక కంపెనీ వంద కోట్ల టర్నోవర్ కలిగి….ఏదైనా కాంట్రాక్ట్ పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటే టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంది అని తెలిపారు.
ఎక్కువమంది టెండర్ లో పాల్గొంటే మరింతగా రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జుడిషియల్ ప్రివ్యూ కమిషన్, రివర్స్ బిడింగ్ పారదర్శకత కోసమే అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో కాంటాక్ట్ అవ్వటం జరిగిందని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా టెండర్ విషయంలో ఎలాంటి అనుమానం ఇబ్బంది ఉన్న ప్రభుత్వం నుంచి పూర్తి గ్యారెంటీ ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.