ఏపీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రజలతో తన పరిపాలన గురించి స్పందన తెలుసుకోవడానికి ఎప్పటినుండో ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకుగాను “రచ్చబండ” అనే కార్యక్రమం పేరుతో ప్రజలతో మమేకమై ప్రభుత్వం పని చేస్తున్న తీరు పై వారి అభిప్రాయాలను నేరుగా జగన్ తెలుసుకోవాలని ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న… కరోనా మహమ్మారి రావటంతో ఈ కార్యక్రమం ఉన్న కొద్ది వాయిదా పడుతూ వస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన వెంటనే ఈ కార్యక్రమం చేయటానికి రెడీ అవుతున్నట్లు తాజాగా స్పందన కార్యక్రమం సమావేశంలో కలెక్టర్లకు మరియు ఎస్పీలకు సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
అప్పటిలోగా ఇళ్ళ పట్టల కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో గ్రామాలలో ఇల్లు లేని వారు ఎవరు చేతులు ఎత్తకుండా ఉండేలా … ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అదే రీతిలో రచ్చబండలో స్వయంగా గ్రామ సెక్రటేరియట్ లో అసలు ఏం జరుగుతుందో అన్నీ తానే చూస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే రీతిలో కరోనా విషయంలో ప్రభుత్వ అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.