Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలన పరంగా.. ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి మేలు చేసే రీతిలో… అన్న తరహాలో కాకుండా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా పరిపాలన అందించడం వల్లే రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వచ్చాయని.. ప్రజలు ఆదరిస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఏ విధంగా అయితే… పరిపాలన అందిస్తున్నారో అభివృద్ధి విషయంలో కూడా అదే రీతిలో.. జగన్ ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు అంటూ రాష్ట్రంలో.. అంతటా అభివృద్ధి జరగాలని మూడు రాజధానులు అనే ఆలోచన తెరపైకి తీసుకువచ్చి విశాఖను పరిపాలన రాజధానిగా చేసే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. దీంతో ప్రస్తుతం విశాఖ చుట్టుపక్కల అదేవిధంగా విశాఖలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విశాఖలో అదరగొట్టే అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మేటర్ లోకి వెళ్తే విశాఖ నగరం నుంచి భోగాపురం ప్రాంతానికి అతి వేగంగా చేరుకునేలా రోడ్డు నిర్మాణం పనులు స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బైపాస్ మార్గాల నిర్మాణం. మెట్రో, ట్రాం రైలు వ్యవస్థ ఏర్పాటు అదేవిధంగా విశాఖను సర్వాంగసుందరంగా చక్కటి పర్యాటక ప్రాంతంగా నిలిచేలా బీచ్ రోడ్డు అభివృద్ధి పనులు స్టార్ట్ చేసే ఆలోచనలో జగన్ గవర్నమెంట్ రెడీ అయింది. ఈ ఏడాదిలో విశాఖ రూపురేఖలు మారిపోయేలా పరిపాలన రాజధాని రూపం వచ్చేలా అధికారులు పనులకు సన్నద్ధమవుతున్నారు.