వైయస్ జగన్ ఏదైనా అనుకుంటే సాధించేవరకు నిద్రపోని మొండి వ్యక్తి అని ఆయన సన్నిహితులతో పాటు ఆయనకు దగ్గరగా ఉండే పొలిటికల్ నేతలు కూడా అంటుంటారు. అందువల్లే పది సంవత్సరాల్లో రాజకీయంగా అనేక దెబ్బలు తగిలినా గాని అనుకున్న ముఖ్యమంత్రి పదవిని సాధించారని చెప్పుకొస్తారు. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ చాలా వరకు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. బీజేపీతో పూర్తిగా కలవకపోయినా వివిధ అంశాలలో మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చాక తన ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు గురి చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయాన్ని ఈ పార్లమెంటు సమావేశాలలో తేల్చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్ వస్తుంది.
ఎన్నికలలో గెలిచిన తర్వాత పార్టీ చెప్పినట్టు కాక సొంత ఆలోచనలతో ముందుకు వెళుతూ జగన్ సర్కార్ కి అనేకసార్లు తలనొప్పులు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్లమెంటు సమావేశాలలో ఎంపీ పై అనర్హత వేటు వేయించడానికి జగన్ మిగతా 21 మంది ఎంపీల చేత ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు టాక్ వస్తోంది. ఒక్క రఘురామకృష్ణంరాజు విషయం మాత్రమే కాకుండా శాసన మండలి రద్దు విషయం కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో తేల్చేయాలని… ఈ విషయంలో పెద్దాయన మోడీ ఈగో హర్ట్ అవ్వకుండా… చాలా సైలెంట్ గా పార్లమెంటులో ఈ రెండు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగిందట.
కానీ స్పీకర్ నుండి స్పందన రాకపోవడంతో.. సమావేశాలు అయ్యేలోపు ఎలాగైనా ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు పడే విధంగా జగన్ నేషనల్ స్థాయిలో రాజకీయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రఘురామకష్ణంరాజు బీజేపీ పార్టీలో ఉండే కీలక నాయకులకు అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో పెద్దాయన మోడీ ఈగో హర్ట్ అవ్వకుండా జగన్ సరికొత్తగా ఈ విషయాన్ని డీల్ చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలావరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని జగన్ చాలా ప్రెస్టేజ్ కి తీసుకున్నట్లు వైసిపి పార్టీ లో టాక్ నడుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?