ys jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 ఎన్నికల టైంలో వన్ మాన్ ఆర్మీ తరహాలో ఏపీలో చరిత్ర సృష్టించే విధంగా విజయం సాధించడం తెలిసిందే. తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి..చంద్రబాబు కి దిమ్మతిరిగే రీతిలో జగన్ గత సార్వత్రిక ఎన్నికలలో గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్ గెలిచిన తర్వాత ..ప్రత్యర్థుల గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దాదాపు మేనిఫెస్టోలో 90% వాగ్దానాలు అతి తక్కువ కాలంలోనే అమలు అయ్యే రీతిలో ప్రస్తుతం పరిపాలన చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ ప్రజలు కూడా జగన్ పాలన కి జై కొడుతూ ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో వైసిపికి పట్టం కట్టడం జరిగింది. స్థానిక ఎన్నికలలో ఎక్కడా కూడా జగన్.. తనకు ఓటు వేయాలని సభలు నిర్వహించడం లేదా మీడియా సమావేశం కూడా పెట్టలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14 వ తారీకు ఎన్నికల రోడ్ షోలో పాల్గొని భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. జగన్ సీఎం అయ్యాక ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు ఓటు వేయాలని అడిగిన సందర్భాలు లేవు. ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంటు ఎన్నిక కోసం జగన్ సీఎం అయ్యాక మొట్టమొదటిసారి బహిరంగ సభలో పాల్గొంటున్న క్రమంలో..పార్టీ నేతలు తిరుపతి సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చూసుకుంటున్నారు.