అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ‘సమర శంఖారావం’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుండి ఇఛ్చాపురం వరకూ పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు పార్టీ బలోపేతానికి సమర శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో బూత్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని చెప్పారు.