ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో కొన్ని అరాచక శక్తులు ఏపి ప్రజల మధ్య మత కల్లోలాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్. దీంతో ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా వైయస్ జగన్ ని కొన్ని మతాలకు వ్యతిరేకంగా చూపించడానికే జరుగుతున్న కుట్ర అని టాక్.
ఇటువంటి నేపథ్యంలో వైసిపి పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఇటీవల తెల్లవారుజామున వైఎస్ జగన్ అలర్ట్ చేసి సీక్రెట్ మీటింగ్ పెట్టినట్లు టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రతి నియోజక వర్గాలలో బిజెపి పార్టీ పనితీరును కంట కనిపెట్టాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించినట్లు సమాచారం. ఇది కావాలని దేవాలయాలపై దాడులు చేసి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి జరుగుతున్న కుట్ర అని దీనిలో టిడిపి పాత్ర కూడా ఉందని కాబట్టి వైసిపి ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారట.
ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు అని…. హిందూ దేవాలయాలపై దాడులు ఇదంతా రాజకీయ కుట్ర అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ సూచించినట్లు సమాచారం. అంతేకాకుండా మీ మీ నియోజకవర్గాలలో ఉండే హిందూ దేవాలయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా వైయస్ జగన్ ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారట. మొత్తం మీద చూసుకుంటే కుల రాజకీయ ప్రాతిపదికన ఏపీలో నడిచే రాజకీయాలు ఇప్పుడు మొత్తం చుట్టూ తిరగడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.