అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో టిడిపి మద్దతుదారులు చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే ఉచిత విద్యుత్ అనే పథకం కరెంటు తీగలపై బట్టలు అర పెట్టుకోవడానికి బాగుంటుందని కామెంట్లు చేశారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి చరిత్ర సృష్టించారు. ఇది గడిచి చాలా ఏళ్ళు అయిపోయింది.
అయితే తాజాగా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకాన్ని కావాలని నీరుగారుస్తున్నారని చంద్రబాబు అండ్ కో అదేవిధంగా ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా చానెల్స్ తెగ గగ్గోలు పెడుతున్నాయి. వైయస్ జగన్ ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. దీంతో విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టారు. ఉచిత విద్యుత్ పథకంకు రైతు ఖాతాలో నగదు బదిలీ అవుతుందని, అంతేతప్ప ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం ఎక్కడ జరగటం లేదని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలన్నింటినీ నగదు బదిలీ పథకం కింద మార్చాలనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని…. చట్టం వచ్చిన తర్వాత అమలుకు హడావిడి పడకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంలో టిడిపి కావాలనే రాజకీయం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన వర్గం మీడియా తో తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి చంద్రబాబు పై ఫిర్యాదు చేయడానికి వైయస్ జగన్ రెడీ అయినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రజలకు తప్పుదోవ పట్టించే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విధంగా జగన్ ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినపడుతోంది.