2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలవడం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ఓటమికి గల కారణాలు గురించి చాలా వరకు వినబడిన మాటలు చూస్తే 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవటంతో పాటు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చంద్రబాబు చేశారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అందువల్లే చంద్రబాబు 2019 ఎన్నికలలో ఘోరమైన ఓటమి చూడటం జరిగిందని మేధావులు కూడా చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ జగన్ కూడా బాబు మాదిరిగానే వ్యవహరిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినబడుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో జగన్ సర్కార్ అనవసర హడావిడికి పాల్పడుతున్నారని ఏపీ జనాల అనుకుంటున్నారట. చంద్రబాబు మాదిరిగా ర్యాంకులు అంటూ జగన్ ప్రభుత్వం అనవసర హడావిడి చేస్తుందని చెప్పు కొంటున్నారట.
జగన్ అధికారంలోకి వచ్చి 16 నెలలుగా కావచ్చిన మధ్యలో ఆరు నెలలు చూస్తే కరోనా వైరస్ అంతకుముందు ఏడాది చూస్తే చాలా వరకు జగన్ సంక్షేమ పథకాలపై అలాగే ఎన్నికల మేనిఫెస్టో అమలుపై మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. మరి మధ్యలో పెట్టుబడులు ఎలా వచ్చాయి…. పెట్టుబడుల విషయంలో ఏపీ చాలావరకు వెనుకబడిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు అని మీడియా సర్కిల్స్ లో వార్తలు వెలువడుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో ఏపీ పారిశ్రామిక రంగం ఉంటే….జగన్ ప్రభుత్వం అంత సాధించాం ఇంత సాధించాం అని చెప్పుకోవటం విడ్డూరం అని అంటున్నారట.
అంతేకాకుండా చంద్రబాబు నచ్చకే నిన్ను గెలిపించాం మళ్ళి నువ్వు కూడా అదే బాటలో వెళ్ళటం ఏంటి అని, ఇలా అయితే ఎలా అని జనాలు అంటున్నారట. సంక్షేమం మరియు ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాల విషయంలో అంతా సవ్యంగా జరుగుతున్న…. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలావరకు వెనుకబడి పోయిందని ఏపీ జనాలు బలంగా నమ్ముతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.