Ys Jagan: వైయస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, కర్నూలు హైకోర్టు అదేరీతిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. రాష్ట్రంలో ఫెయిల్ కాలేజీల పర్మిషన్ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ వరుస భేటీలు అయ్యి చర్చించటం జరిగింది.
ఈ భేటీలో భాగంగా కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకు పైగా కడుతున్న ఇళ్ల కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. మౌలిక వసతులు కల్పించాలని జగన్ ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఇటువంటి తరుణంలో జగన్ ప్రభుత్వంపై దుర్గా శంకర్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పేదలకోసం ఏకంగా 17,005 కాలనీలో అన్ని లక్షల ఇల్ల నిర్మాణాలను చేపట్టడం.. ప్రపంచంలోనే అరుదైన రికార్డు.
Read More: YS Jagan: రఘురామకు అదిరిపోయే షాకిచ్చిన జగన్ టైం ఎప్పుడూ ఒకరిదే ఉండదు రాజుగారు!
అంతమాత్రమే కాకుండా ప్రత్యేకంగా పేదల ఇళ్ల నిర్మాణాలు కోసం జగన్ ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ నియమించటం బట్టి చూస్తే ఆయనకు పేదల పట్ల ఉన్న శ్రద్ధ ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది అని పొగడ్తల వర్షం కురిపించారు. అంత మాత్రమే కాక త్వరలోనే స్వయంగా అ వచ్చి ఆ కాలనీలను సందర్శిస్తారు అంటూ దుర్గా శంకర్ మిశ్రా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పేదలకు కడుతున్న ఇళ్ల నిర్మాణం పనులు పై పొగడ్తల వర్షం కురిపించింది.