YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు… వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. దీనిని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు ఆమె రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతు ఇస్తున్న నేతలతో, వైఎస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ యువతపై దృష్టి సారించారు. స్టూడెంట్స్ తో వరుస భేటీలు నిర్వహించడం… కేసీఆర్ ప్రభుత్వం మీకు ఏమి చేసిందని ప్రశ్నించడం వంటి ఎన్నో రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఏప్రిల్ 9న ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
అదే సమయంలో పార్టీ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అధికారికమైన స్పష్టతతో ముందుకు వెళ్లిపోతున్నారు అని అర్థమవుతుంది. దీని కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ లోపలే పార్టీ పేరు లీక్ అయిపోయింది.
తాజాగా వైఎస్ షర్మిల తన దగ్గరికి వచ్చిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చే ఏడాది ఎన్నికల్లో మన ‘వైయస్సార్ పార్టీ’ నే అధికారంలోకి వస్తుందని పొరపాటున నోరు జారారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి ‘వైయస్సార్‘ అనే పేరుని పెడుతున్నట్లు ఈ కొంచెం మాత్రమే మనకు చాలు అని అన్నట్లు తెలుస్తోంది.
ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని కూడా వైఎస్ షర్మిల స్పష్టం చేసినట్లు చేసింది. షర్మిల ఎలా కొత్త పార్టీ పెడుతుంది అని తెలిసినప్పటి నుండి కేసీఆర్ ఆమె వెనుక ఉన్నాడని… చివరికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి తోనే ఆమె కలుస్తుందని అందరూ అన్నారు. అయితే టీఆర్ఎస్, బీజేపీ చెబితే నేను రాజకీయాల్లోకి రాలేదు అని షర్మిల స్పష్టం చేయడం జరిగింది.
తెలంగాణలో రాజన్న రాజ్యం అందించడమే తన ధ్యేయమని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కీలకం కానుంది. ఇక దీనికి సంబంధించిన వాల్పోస్టర్ కరపత్రాన్ని విడుదల చేశారు. షర్మిల పార్టీ పేరు, గుర్తు, జెండా ఎలా ఉంబోతుందో అని… రెండు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తిగా ఉంది