మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సిబిఐ… సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తోంది. వివేకా కుమార్తె లేవనెత్తిన అంశాలపై లోతైన విచారణ సిబిఐ జరుపుతోంది. దీంతో కడప సీబీఐ కార్యాలయంలో కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో కీలకమైన అనుమానితుల వ్యక్తులు అందుబాటులో ఉండాలని, అంతకుముందే పలువురికి సమాచారం ఇచ్చినా సిబిఐ, ఇప్పుడు కేసులో అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తోంది. తాజాగా సీబీఐ ముందుకు దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఎంపీ అవినాష్ రెడ్డి కి ప్రధాన అనుచరుడు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆ ఇంటి లోకి ముందుగా వెళ్లినవారిలో శంకర్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా ఇటీవల ఈయన్ని పిలిచి సిబిఐ అధికారులు ఎంక్వయిరీ చేయడం తో…కీలక విషయం బయటపడినట్లు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఒక కీలక నేత రానున్న రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అప్పట్లో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అన్నట్టు సమాచారం. సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలోనే పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలను సీబీఐ ఇప్పటికే విచారించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో త్వరలో ఓ కీలక నాయకుడు అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు రావడంతో… ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.