Ys Sharmila : తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని, ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే నిన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షకు కూర్చున్నారు. అయితే దీక్ష నుండి పాదయాత్రగా షర్మిల బయల్దేరడంతో ఆమెను అరెస్టు చేయడమే కాక.. ఆమె చీర చిరిగి పోయేలా పోలీసులు ఆమె పట్ల వ్యవహరించారు.
దీంతో నిన్నటి దీక్ష కొనసాగింపుగా లోటస్ పాండ్ వద్ద షర్మిల కూర్చోవటం జరిగింది. ఇదిలా ఉంటే షర్మిల దీక్ష చేస్తున్న ప్రాంగణంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత ప్రత్యక్షమయ్యారు. ఆమె పక్కనే కూర్చుని ఆమె కు సంఘీభావంగా తన మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పెద్ద సంచలనం రేపుతోంది. సిబిఐ మూడో సారీ విచారణ చేపట్టి అనుమానితులను మరోసారి విచారణ చేస్తున్నారు. తండ్రి చనిపోయి రెండు సంవత్సరాలు అయిన క్రమంలో..ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన వైయస్ వివేకా కూతురు డాక్టర్ సునీత.. ఈ విషయంలో ఖచ్చితంగా తనకి షర్మిల సపోర్ట్ ఉంటుందని తెలియజేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఆమె షర్మిల దీక్ష ప్రాంగణం వద్ద కూర్చోవటం సంచలనం రేపుతోంది.