ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య విషయంలో కలుగజేసుకోవలన్న ఇతర రాష్ట్రాల నాయకులు చాలా భయపడేవారు. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి చాలా విభిన్నంగా ఉంటుందని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు అనే టాక్ నేషనల్ స్థాయిలో ఉంది. ముఖ్యంగా వైయస్సార్ హయాంలో ఎవరు కూడా రాష్ట్రం యొక్క జోలికి వచ్చే వారు కాదు.
ప్రత్యేక తెలంగాణ కానీ ఉద్యమం చేసిన నాయకులు కూడా రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన ఊహించని రీతిలో ప్రజలకు అందించడంతో… పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, చెప్పినవి చెప్పనవి కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసే వాళ్ళు. దీంతో తనదైన శైలిలో ఏపీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వైయస్సార్… రెండోసారి గెలిచిన తర్వాత మూడు నెలలకే మరణించడం నిజంగా తెలుగు ప్రజల పాలిట అన్యాయం అని జాతీయస్థాయిలో టాక్ ఉంది.
ఆయన చనిపోవడమే రాష్ట్రాన్ని ఆనాటి యూపీఎ కేంద్ర ప్రభుత్వం రెండు ముక్కలుగా చేయటంతో…. తెలుగు ప్రజలు చాలా వరకు నష్టపోవడం జరిగిందని చెప్పుకొస్తుంటారు. 2014 ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలో నష్టపోయిన పర్వాలేదని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో వ్యవహరించిన తీరు వాళ్లకే పెద్ద ఎసరు పెట్టిందని మేధావులు ఇప్పటికే అంటారు. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగిందో…అదే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీయడం నిజంగా తెలుగు ప్రజల పాలిట అన్యాయమని, నిజంగా వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ కనీసం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసి ఉండేది కాదని, ఆయన మరణించడంతోనే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అని ఇప్పటికీ చాలామంది అంటారు.
కాగా ఎప్పుడైతే రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందో ఏపీలో పూర్తిగా పట్టు కోల్పోయింది. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలంతా పక్కన పెట్టేశారు. కానీ వైఎస్ కొడుకు వైయస్ జగన్ ని మాత్రం ఆదరిస్తూ గత సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి… తిరుగులేని ముఖ్యమంత్రిగా ఏపీ జనాలు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వైయస్ జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రికి తగ్గ రీతిలో సంక్షేమ పరిపాలన దేశంలో పెద్ద పెద్ద నాయకులకే మతిపోయేలా జరుగుతోంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ రెండవ తారీకు వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ నేతలు భారీ స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు. వైయస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు.