దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాలలో జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో చాలాచోట్ల 11 వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. దేశం మొత్తం గర్వించదగ్గ పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన వైయస్సార్ రాజకీయ నాయకుడు కంటే మొదట ప్రపంచం మెచ్చిన డాక్టర్ గా రాణించారు. ఒక్క రూపాయికే వైద్యం అందించి పుట్టిన ఊరికి రుణం తీర్చుకున్నారు. గుల్బర్ గా కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ పట్టా పొందారు.
ఆ తరువాత జమ్మలమడుగులో వైద్యుడిగా రాణించిన వైయస్సార్ సొంత ఊరు పులివెందులలో తండ్రి వైయస్ రాజా రెడ్డి తన పేరు మీదనే హాస్పిటల్ పెట్టి కొడుకుని వైద్యుడిగా పెట్టడం జరిగింది. దీంతో వైయస్సార్ పుట్టిన భూమి రుణం తీర్చుకునేలా ఒక్క రూపాయికే వైద్యాన్ని అందించారు. 24 గంటల పాటు వైద్యం అందించే హాస్పిటల్ లో చాలా మంది పేదవాళ్లని వైయస్ రాజశేఖర్ రెడ్డి తన వైద్యం ద్వారా ఆదుకోవడం జరిగింది. దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరు రూపాయి డాక్టర్ అని వైయస్సార్ ని ముద్దుగా పిలుచుకునేవారు.
అంతేకాకుండా వైయస్ దగ్గర వైద్యం చేయించుకునే వాళ్ళు అదృష్టవంతులని అప్పట్లో ప్రజలు చెప్పుకునే వారట. ఈ విధంగా వైయస్సార్ అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైద్యుడిగా…కడపలో పేదలకు అందిస్తున్నా వైద్య సేవలు చాలా మందిని ప్రభావితం చేశాయి. దీంతో మూడు పదుల వయసు రాకముందే ప్రజల హృదయాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి 1978లో వైద్యశాఖ మంత్రి పదవిని దక్కించుకుని రాయలసీమ ప్రాంతానికి అనేక సేవలు అందించారు.
ఆ సమయంలో ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా వైయస్సార్ తీసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలావరకు అప్పట్లో నిధులను రాయలసీమ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భారీ స్థాయిలో వైయస్సార్ ఖర్చు పెట్టడం తో…. వైయస్ పేరు కడప జిల్లా దాటుకుని రాయలసీమ ప్రాంతంలో మారుమ్రోగింది. అంతేకాకుండా కడప జిల్లాలో పేద విద్యార్థులకు స్కూల్ లు, కళాశాలలు కట్టించి వారి జీవితాలలో వెలుగులు నింపగలిగారు. ఆ తరువాత ఆ విద్యాసంస్థ లన్నిటిని లయోలా విద్యాసంస్థలకు వైయస్సార్ అప్పజెప్పారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా దేశం లో నాయకులు ప్రభావితమయ్యే రీతిలో పరిపాలన అందించి…ఏపీ ప్రజల హృదయాల్లో నిలిచి వైఎస్ఆర్ స్వర్గస్తులయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన “ఆరోగ్యశ్రీ” పథకం ద్వారా అనేక మంది హృదయాల్లో, కుటుంబాలలో సంతోషం నింపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?