ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అటువంటిది ఇటీవల రెండో విడత వాహన మిత్ర కార్యక్రమం నాలుగు నెలలకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆటో మరియు టాక్సీ డ్రైవర్ల అందరికీ వాహన మిత్ర అర్హులందరికీ ఒక్కొక్కరి అకౌంట్లో పదివేల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరిగింది.
ఆల్రెడీ మొదటి విడత కార్యక్రమం జరిగిన తరువాత రెండో విడత కార్యక్రమానికి ఇంకా టైం ఉన్నాగాని కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో ఎటువంటి వ్యాపారం లేని ఆటో మరియు టాక్సీ డ్రైవర్ లకు జగన్ సర్కార్ తాజాగా ఇచ్చిన 10 వేల రూపాయలు వాళ్లకు ఎంతగానో మేలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో టాక్సీ డ్రైవర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడటం జరిగింది. సీఎం జగన్ మాట్లాడుతూ రెండో విడత వాహన మిత్ర పథకం ద్వారా 2,62, 493 మందికి లబ్ధి చేకూరుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. నాలుగు నెలలకు ముందే ఈసారి వైయస్సార్ వాహన మిత్ర రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జగన్ తెలిపారు.
చాలా మంది ఆటో డ్రైవర్లు వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ తో మాట్లాడుతూ గత ప్రభుత్వం మా లాంటి చిన్న బతుకులపై అనేకమైన ఫైన్ లు వేసి ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. కానీ మీ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు ఏమీ లేవని మీ పరిపాలన పేద ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆటో కార్మికుడు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో మా పిల్లలను చదివించడానికి మా మీద భారం లేకుండా మీరే అమ్మఒడి ద్వారా చదివిస్తున్నారు అని కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం పథకం ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా మా పిల్లలని పోషిస్తూ మా జీవితంలో సగం భారం మీరే మోస్తున్నారు అంటూ భావోద్వేగానికి ఆటో డ్రైవర్ గురయ్యాడు. చాలా వయసున్న ఆ ఆటోడ్రైవర్ ఇంకా మాట్లాడుతూ నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ మీలాంటి వారిని చూడలేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.