వైసిపి లీడర్ లో మంత్రిగా ఉన్న ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పూర్తి విషయంలోకి వెళితే వైసిపి పార్టీకి చెందిన 21 మంది ఎంపీలను రాజకీయంగా వారి పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఈ ఎమ్మెల్యే ఏ పనులు వారికి దక్కకుండా అంతా ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే పనులు జరిగేలా చక్రం తిప్పుతున్నారు అని టాక్. దీంతో ఎంపీలుగా పార్టీ నుండి గెలిచినా పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రజల నుండి తమకు ఎటువంటి గౌరవం దక్కకపోవడంతో పాటు తమని నమ్ముకున్న కిందిస్థాయి పార్టీ కేడర్ కి ఏ విషయంలోనూ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందట.
21 ఎంపీ స్థానాలలో ఇదే పరిస్థితి నెలకొనడంతో… జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అంతా ఆ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేయడానికి డిసైడ్ అయినట్లు వైసిపి పార్టీ లో టాక్ నడుస్తుంది. పార్టీ తరపున ఎంపీగా గెలిచిన గాని… ఎక్కడ కూడా ప్రభుత్వ పనులకు సంబంధించి ఏ ఒక్కటి తమ చేతిదాకా రాకుండా.. సదరు ఎమ్మెల్యే పై నుండి మొత్తమంతా అధికారుల చేత చేయించడంతో ఎంపీలంతా ఇది తమని అవమానించినట్టుగా భావిస్తున్నారట.
అంతేకాకుండా చాలా మంది ఎంపీల సేగ్నెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు నుండి కూడా సరైన గౌరవం రావడంలేదని, గుర్తింపు లేదని ఎంపీలంతా ఈ విషయాలను జగన్ సమక్షంలో త్వరలో చర్చించటానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఏలాంటి ప్రాజెక్టు పనులకు సంబంధించి టెండర్లు గాని ఇంకా అనేక విషయాలు గానీ తమ చేతి దాకా రాకుండా వైసిపి అధిష్టానం వ్యవహరిస్తూ ఉండటంతో ఎంపీలంతా తెగ ఫీలై పోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేల నుండి ఎంపీలకు ఆహ్వానం రావడంలేదని, దీనిపై ఎలాగైనా జగన్ తోనే తాడోపేడో తేల్చుకోవాలని వైసిపి ఎంపీలంతా ఇటీవల డిస్కషన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.