రాష్ట్రంలో రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. విమర్శలు శృతి మించడం.. ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దు మీరడం.. బూతు పురాణం.. బెదిరింపులతో ఏపీ రాజకీయాలు హాట్ గానే ఉంటున్నాయి. వైసీపీ – టీడీపీ చుట్టూనే ప్రధాన రాజకీయం నడుస్తోంది. గతంలో ఎన్నడూ రాజకీయంగా వినిపించని మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వీటన్నింటి చూట్టూ వివాదాలు రేగుతున్నాయి. వీటికెవరు ఆద్యులు అంటే.. వైసీపీ, టీడీపీ పార్టీలు రెండూ ఒకే తాను ముక్కలుగా ఉంటున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనికి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధికారంలో ఉండగా చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే..
అసెంబ్లీ సాక్షిగానే బొండా ఉమ బెదిరింపులు..
ప్రస్తుతం వైసీపీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలను బూతద్దంలో చూస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. టీడీపీఅధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కనీసం అద్దంలో కూడా చూడలేదని అంటున్నారు. చంద్రబాబుతోపాటు అచ్చెన్నాయుడు, బొండా ఉమ ఏకంగా అసెంబ్లీలోనే చేసిన వ్యాఖ్యలను వీరు ప్రస్తావిస్తున్నారు. ‘ఏంట్రా.. ఏంట్రా.. ఏంట్రారారేయ్.. పాతేస్తా’ అని బొండా ఉమ, ‘మగతనం ఉంటే..’ అని అచ్చెన్నాయుడు, ‘మా సభ్యులు ఇలానే ఉంటాం.. మీ సంగతేంటో తేలుస్తాం.. వదిలిపెట్టను మిమ్మల్ని’ అని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు అన్న మాటలతో వారే బీజం వేశారని అంటున్నారు. సీఎం హాదాలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటి సీఎం జగన్ ను కూడా ఏ1, జైలుకెళ్లి వచ్చాడు అంటూ చేస్తున్ వ్యాఖ్యలు చంద్రబాబు స్థాయికి తగినవేనా అని కొందరు విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
ప్రతీకారంగా వైసీపీ చెల్లింపు..
అప్పట్లో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ నాయకులు వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తున్నారు. వారి వ్యాఖ్యల పర్యావసానమే వైసీపీ నాయకుల మాటలకు కారణాలు. వైసీపీ నాయకులు మరింతగా రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం టీడీపీనే పరోక్ష కారణం. ఈ తరహా రాజకీయాలు రాష్ట్రంలో కొత్తగా మొదలయ్యాయనే చెప్పాలి. పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఆరోజు చంద్రబాబు ఎందుకు వారిని ఖండించలేదని కొందరు రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. అలా మాట్లాడిన వారు ఇప్పుడు వైసీపీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలను ఎందుకు తప్పుబడుతున్నారని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?