ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై సొంత పార్టీలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిలో ఒకటి రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం. ఈ విషయంలో గుంటూరు మరియు తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందు ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. గుంటూరు వినుకొండ ఎమ్మెల్యే అయితే ఏకంగా నియోజకవర్గంలో దోసెడు ఇసుక కూడా దొరకటం లేదని అధికారులు పనితనం బాగోలేదని జడ్పీ సమావేశంలో షాకింగ్ కామెంట్లు చేశారు.
దీంతో సొంత పార్టీ నేతలతో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకున పడటంతో పాటుగా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు పరిస్థితిలు మారటంతో అన్ని ఇసుక సమస్యలకి ఒకే ఒక సొల్యూషన్ తరహాలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మళ్లీ రీచ్లు ప్రారంభమవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. వారం రోజుల్లో ఇసుక మూడు లక్షల టన్నుల ఉత్పత్తి కి చేరుకుంటుందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు.
అదేమిటంటే రాష్ట్రంలో ప్రజలకు గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ లు జరిగేలా అవకాశం కల్పించాలని అని సమస్యలకు చెక్ పేటే సొల్యూషన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా నదుల పరిసర గ్రామాల ప్రజలు సొంత గ్రామాలకు ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతినివ్వాలని అధికారులకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సమయములో ఎవరైనా ఉచితంగా తీసుకెళుతూ వేరే వారికి అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ సూచించారు. అంతేకాకుండా ఇసుక బుకింగ్స్ కు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించాలని చెప్పారు. శాండ్ పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బల్క్ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్ కలెక్టర్కు అప్పగించాలని చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?