Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు Chandrababu Naidu తెలంగాణలో టీడీపీ ఉనికి పోయింది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఏపీలో.. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కి మద్దతిచ్చి టీడీపీకి దూరమయ్యారు. ఇక ఎవరు పార్టీ వీడతారో.. ఎవరు ఉంటారో అనే సందిగ్ధంలో టీడీపీని కరోనా కాపాడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారి చేసేది లేక.. జగన్ కూ ఇప్పట్లో ఎవరి అవసరమూ లేక కొంత స్తబ్దత నెలకొంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు టీడీపీని కాపాడుకుంటున్నారు. అయితే.. అనూహ్యంగా ఓ వైసీపీ నేత.. అదీ కడపకు చెందిన నేత చంద్రబాబు నాయుడును కలుసుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆమధ్య తిరుపతి ఉప ఎన్నిక పర్యటనలో ఉండగా కలిశారు. అప్పట్లోనే ఈ విషయం చర్చనీయాంశం అయింది. అయితే.. కొన్నాళ్లుగా మరుగునపడిన ఈ విషయం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటివలే హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో రాంప్రసాద్ మళ్లీ భేటీ అయినట్టు తెలుస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, వైసీపీ తీరు, టీడీపీలో చేరడం.. వంటి విషయాలు చర్చించినట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ లో ఉండి పీసీసీ సభ్యుడిగా కూడా ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్ట ఈ భేటీ తర్వాత వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష భాద్యతలు ఇవ్వాలని కూడా కోరినట్టు సమాచారం.
Read More: Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?
వీరిద్దరూ గతంలోనే శ్రీకాళహస్తిలో కలిసినప్పుడు రామ్ ప్రసాద్ ఇవే కోరారని సమాచారం. ఎన్నికల హడావిడి అయ్యాక కలుద్దామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలేనే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. స్థానికంగా టీడీపీని బలోపేతం చేస్తానని రామ్ ప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ సొంత జిల్లా.. పైగా జగన్ తోనే కొన్నాళ్లు ట్రావెల్ చేసిన వ్యక్తి కావడంతో చండ్రబాబు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ ప్రసాద్ ను చేర్చుకుని జిల్లా అధ్యక్షుడిగా చేయడం అంటే చంద్రబాబే స్వయంగా కొందరిని బుజ్జగించాలి. మరి.. రామ్ ప్రసాద్ రెడ్డి చంద్రబాబుని కలిసారన్న వార్తలు నిజమే అయితే.. వైసీపీ నాయకత్వం, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.