Ap Assembly: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో పొలాలు మరియు మతాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ తో పాటు కొంతమంది వ్యక్తులతో కుట్రపూరితంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ఒకరోజు నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే… రఘురామ కృష్ణం రాజు పై ఎవరూ ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళ్తే ఎమ్మెల్యే జోగి రమేష్ రఘురామకృష్ణంరాజు పై విమర్శల వర్షం కురిపించారు. వైసిపి పార్టీ గుర్తు పై వైసీపీ పార్టీ జండా తో.. జగన్ ఫోటో గెలిచిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించరని.. రఘురామకృష్ణంరాజు వెన్నుపోటు దారుడు అన్న రీతిలో కామెంట్లు చేశారు. చంద్రబాబుతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత గొడవలు సృష్టించడానికి ఈ లుచ్చా వెధవ పన్నాగాలు పన్నాడు అని జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఎంతగానో మేలుచేసే జగన్ ప్రభుత్వం పై ఇష్టానుసారంగా మాట్లాడే ఈ రఘురామకృష్ణంరాజు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే… రాజీనామా చేసి.. పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలిచే ఛాన్స్ లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో దాదాపు 14 నెలలు వైరస్ తో పోరాడుతూ… మరోపక్క ప్రజలకు లక్ష కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పై… బురదజల్లడానికి కొన్ని కుట్రపూరిత మీడియా చానల్స్ తో రఘురామకృష్ణంరాజు ప్లాన్ వేశారని.. విమర్శిస్తూ ఇంకా అనేక రీతులుగా ఎమ్మెల్యే జోగి రమేష్ .. ఆయన వ్యవహారాన్ని తప్పుబట్టారు.