Corona: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఎవరిని విడిచి పెట్టడం లేదు మహమ్మారి. ఇదిలా ఉంటే తాజాగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు ఊపిరితిత్తులలో సమస్య ఉండటంతో కరోనా సోకినట్లు తెలియకపోవడంతో అశ్రద్ధ చేయటం తో.. ఊపిరితిత్తుల్లో పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.
దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదు నగరంలో కాంటినెంటల్ హాస్పిటల్లో ఐసీయూలో ఉండవల్లి శ్రీదేవి చికిత్స చేయించుకుంటున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న గాని చాపకింద నీరులా.. కొత్త పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయట పడుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.