Raghurama Krishnam Raju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 వ తారీకు నుండి పాఠశాలలో రీఓపెనింగ్ చేస్తున్నట్లు ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేలపటం తెలిసిందే. ఇదే రీతిలో మరోపక్క నాడు-నేడు పనులు త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఏపీ సీఎం జగన్ విద్యా శాఖ అధికారులకు తెలపడం జరిగింది. అంతమాత్రమే కాకుండా ఏపీలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గత కొంత కాలం నుండి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకు వస్తున్న జగన్ ప్రభుత్వం.. చదువు అనేది పేదవాళ్లకు భారం కాకుండా మరోపక్క సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుండి స్కూల్స్ రీఓపెనింగ్ అంశంపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్ చేశారు. అప్పట్లో పిల్లల పరీక్షల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యంతో.. పిల్లల పరీక్షల గండం నుండి బయటపడటం జరిగిందని వెల్లడించారు. అయితే ఆగస్టు నెలలో పాఠశాలలు ఓపెన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న తరుణంలో ఏపీ విద్యార్థులు మరో విషమ పరీక్ష ఎదుర్కొన బోతున్నారని తాజాగా భారీ డైలాగులు వేశారు.
Read More: RRR Episode: ఆర్ఆర్ఆర్ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పెద్ద చిక్కొచ్చిపడిందే..!?
ఈ క్రమంలో ఏపీలో పాఠశాల ప్రారంభం పై రాష్ట్రంలో రహస్య బ్యాలెట్ నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. మరో పక్క ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలో ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఆగస్టు రెండో వారంలో.. పాఠశాలలు ఓపెన్ అయ్యేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.