NewsOrbit
Featured రాజ‌కీయాలు

YSRCP: అద్దె వ్యూహం – అప్పు స్ట్రాటజీనా..!? తడబడుతున్న వైసీపీ..!

YSRCP: ఏపీలో అయిదు రోజుల నుండి రాజకీయాలు బాలేవు.. టీడీపీ (Telugu Desam party) వాడుతున్న బాష.. వైసీపీ (YS jagan) చేసిన దాడి.. దీక్షలు, కక్షలు ఏవీ సమర్ధనీయం కాదు. 2019 కి ముందు ఒక అనామక నాయకుడిగా ఉన్న పట్టాభి అనే వ్యక్తి.. ఆకస్మికంగా వచ్చి నోరేసుకుని పడిపోయి.. అర్ధం లేని ఆరోపణలు చేస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ ఊరుకోదు అని స్పష్టం చేసింది. అక్కడ వరకు ఒకే.., కానీ ఆ తర్వాత వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేసుకుంటూ ఫోరికిపోతుంది..! టీడీపీ తరహా పార్టీని ప్రజలు ఆమోదించరు. చంద్రబాబు వంటి పాలన, అవినీతితో ప్రజలు విసిగిపోయి దారుణ ఓటమిని చూపించారు. పార్టీని మూలాన కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఏపీలో జగన్ అత్యంత ప్రజాబలమున్న నాయకుడు.. ఒకరకంగా దేశంలోనే జగన్ కి మాంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ ఇమేజ్ రెట్టింపవుతుంది.. అందుకే జాతీయస్థాయిలో జగన్ తలదూర్చాల్సిన సమయం వచ్చింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏపీలో పాలన, సంక్షేమం పరంగా జగన్ తండ్రిని మించి ఆకట్టుకుంటున్నారు.. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీలో తెరవెనుక ఎవరున్నారో కానీ.., కాపీ పాలిటిక్స్ ప్రజాబలమున్న తమ పార్టీని తక్కువయ్యేలా.., చీపయ్యేలా ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు..

YSRCP: ప్రజాబలం ఉండగా.. తడబాటు ఎందుకు..!?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ.. తిరుగులేని బలముంది. సంక్షేమంతో పేదల గుండెల్లో నిలుస్తుంది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలముంది.. 22 మంది ఎంపీలు గెలిచారు. రాజ్యసభ సభ్యులు అధికంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 156 లక్షల ఓట్లు వచ్చాయి. పార్టీ బ్యాక్ బోన్ గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. కానీ ఎందుకో గానీ ఆ పార్టీకి సొంత ప్లానింగ్ కనిపించడం లేదు.. డిఫెన్స్ కోసం కాపీ గేమ్స్ ఆడుతూ దొరికిపోతుంది. మరీ సిల్లీగా అయిపోతుంది. వైసీపీ పాలిటిక్స్ చూస్తుంటే సిల్లీ అనిపిస్తున్నాయంటూ కొందరు సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తుండడం ఆ పార్టీ పెద్దలు రియలైజ్ అవ్వాల్సిన అంశం..! పట్టాభి వ్యవహారం.. ఆయన వాడిన పదం ‘బోష్‌డీకే’ అన్నారని, ఆ తరువాత ‘పబ్జీదొర’ అన్నారని ఆ సాయంత్రం టీడీపీ ఆఫీసు మీద, ఆ తరువాతి రోజు దీక్షలు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకా అనేక తప్పులు చేస్తోంది. ఆ తప్పులన్నీ కూడా తెలుగుదేశం పార్టీవి కాపీ కొడుతోంది. ‘బోష్‌డీకే’ అన్నారనీ, ‘బోష్‌డీకే’ అంటే అదో పెద్ద బూతు పదం అంటూ మీడియాలో హైలెట్ చేసుకున్నారు. ప్రచారం చేశారు. సీఎం జగన్ నోటి వెంట కూడా ఆ మాట వచ్చింది.

YSRCP: No Strategy Party Still Confusing
YSRCP No Strategy Party Still Confusing

బాధితులు – బాధ్యులు..!

టీడీపీ ఆఫీసులో వాళ్లు దీక్ష చేస్తే.., వైసీపీ జనాగ్రహ దీక్షలు చేసింది.. టీడీపీ బంద్ చేస్తే వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టారు.. ఆ తరువాత టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లితే.. వైసీపీ నేతలు కూడా ఢిల్లీకి వెళతారు. టీడీపీకేమో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. వైసీపీ బాధలను చెప్పుకోవడానికి వెళతారు. ఇక వైసీపీకి ఢిల్లీ వెళ్లాల్సిన పని ఏముందనేది పెద్ద ప్రశ్న..! ఈ మొత్తం వ్యవహారంలో బాధిత పార్టీ టీడీపీ. తప్పు చేసింది. నోటికి పని చెప్పింది. సీఎం స్థాయిని హీనం చేసేలా మాట్లాడింది టీడీపీ. అందుకు మూల్యం చెల్లించుకుంది. జగన్ అభిమానులకు కోపం వచ్చి కార్యాలయం పగలకొట్టారు.. అక్కడితో వైసీపీ పాత్ర అయినట్టే.. టీడీపీ ఏం చేస్తుంది..? దానిపై జనంలో ఏం చర్చ జరుగుతుంది..? అనేది గమనించుకుని తర్వాత ప్రణాళికలు వేసుకుంటే బాగుండేది. కానీ టీడీపీకి పోటాపోటీగా అదే రోజు, ఏవ్ తరహా కార్యక్రమాలు చేయడం వలన ఎవరికీ ఉపయోగం..!? బాధితులు ఢిల్లీ వెళతారా ? బాధ్యులు వెళతారా? బాధితులు దీక్షలు చేస్తారా? బాధ్యులు దీక్షలు చేస్తారా?. బాధితులు బంద్ చేస్తారా?. బాధ్యులు బంద్ చేస్తారా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి..! మొత్తం వ్యవహారం దగ్గరి నుండి చూస్తుంటే వైసీపీలో ఒక వ్యూహం లేదనిపిస్తుంది. పార్టీ పెద్దలు పిలుపునివ్వడం.. కిందిస్థాయి నాయకులు ఫాలో అవ్వడం తప్పితే.. టీడీపీకి కౌంటర్ గా ఏదో ఒకటి చేయాలని తప్పిస్తే.. వైసీపీలో ఒక నిర్దిష్ట ప్రణాళిక, ఒక రాజకీయ వ్యూహం.. ఈ దాడిని తమకు అనుకూలంగా మలచుకోవడం వంటివి చేస్తే వేరే స్థాయిలో ఉండేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju