వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గారి వ్యవహారం అందరికీ తెలిసిందే. గడచిన నాలుగైదు నెలల నుండి రఘురామ కృష్ణంరాజు పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తిరుగు బాటు బావుటా ఎగురవేస్తూ ఉన్నారు. వైసిపిపై ఏ ఆయుధాలు దొరుకుతాయా ఇరుకున పెట్టేద్దామని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బిజేపి కూడా చేయనన్ని ఆరోపణలను వైసిపి ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు చేస్తున్నాారు. అతి సున్నితమైన, సామాజిక వర్గాన్ని రెడ్లకు అధికంగా పదవులు ఇస్తున్నారని ఆయనే లేవనెత్తారు. అలాగే ఫోన్ ట్యాంపింగ్ ఆంశాన్ని కూడా అందరికంటే ఎక్కువగా రఘురామ కృష్ణంరాజే ఆరోపిస్తున్నారు. తాజాగా హిందూ మతంతో, సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న వినాయక చవితి విషయాన్ని ప్రస్థావిస్తూ కూడా ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విమర్శలు చేస్తున్నారు. సో రాజు గారికి రోజుకు ఒక ఆయుధం దొరుకుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని, సిఏం జగన్మోహనరెడ్డిని ఏలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఇరుకున పట్టాలి అనే విధంగా రాజు గారి ఫంధా నడుస్తోంది. ఆయనను అడ్డుకట్ట వేయడం పార్టీకి, ప్రభుత్వానికి అయితే తరం కావడం లేదు.
తాజాగా ఈ రోజు యుశ్రారైకాపా ఎంపి రఘురామ కృష్ణంరాజు ఏ వ్యాఖ్యలు చేశారంటే….
రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వకపోవడంపై రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హింధూ మత సంస్థలు, స్వామీజీలు, హిందూ మత పెద్దలను సంప్రదించకుండా ఏకపక్షంగా వినాయక చవితి వేడుకల విషయంలో నిర్ణయం తీసుకోవడం హింధూ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు. రాష్ట్రంలో వివాహలు, ఇతర శుభకార్యాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తున్నప్పుడు అటువంటి నిబంధనలే పెట్టి వినాయక చవితి వేడుకలకు ఎందుకు అనుమతులు ఇవ్వకూడదని ప్రశ్నించారు. వినాయక మండపాల అనుమతి విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని జగన్ కు రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెల్లంపల్లి వల్ల ప్రభుత్వానికి, సిఎం జగన్ కు చెడ్డపేరు వస్తుంది అని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలకు వైసిపిీ నుండి కాక బిజెపి నుండి కౌంటర్ లు వస్తున్నాయి. ఇన్నాళ్లు రఘురామ కృష్ణంరాజు గారికి బిజెపి మద్దతు ఉందని ప్రచారం జరిగింది. కానీ బిజెపి నుండి జివిఎల్ నర్శింహరావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు కౌంటర్ లు ఇస్తున్నారు రఘురామకృష్ణంరాజుకి. అంటే ఆయన వెనుక బిజెపి కూడా లేనట్టేకనబడుతోంది. సో.. ఆయన వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు. అన్ని పార్టీలను అడుకుంటున్నారు. సో.. రాజు గారి రాజకీయం ఏమిటో ! రాజు గారి వ్యవహార శైలి ఏమిటో..!నర్సాపురం ప్రజలకైనా తెలుసో లేదో !!