YV Subbareddy: ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వైసిపి నేతలు ఎంతగానో ఎదురు చూసిన కీలక పదవులను సైతం ప్రకటించారు. మొత్తం 135 పదవుల్లో సామజిక సమీకరణాలు, మహిళలు అన్నిటినీ చూసుకుని ఇచ్చారు. ఇక టీటీడీ మాత్రం ఎవరికా అనే ఉత్కంఠ వీడింది. వైవీ సుబ్బారెడ్డికి మళ్ళీ అవకాశం కల్పించారు. ఆయన వద్దు.. వద్దు .. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలని కోరినప్పటికీ అవ్వలేదు. సీఎం జగన్ అందుకు అంగీకరించలేదు. టీటీడీ చైర్మన్ పదవిని మరో ఏడాది పాటూ ఆయనకె కేటాయించారు. అయితే టీటీడీపీ బోర్డు సభ్యులను మాత్రం ఇంకా ప్రకటించలేదు. రెండేళ్ల కిందట 15 మందితో జంబో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ సారి కూడా 15 మందికి కేటాయించే అవకాశం ఉంది. అయితే దీని కోసం మరింత కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
YV Subbareddy: వైవీ ఎక్కడున్నట్టు..!?
ఓ వైపు ప్రభుత్వం వైవీకి టీటీడీ చైర్మన్ పదవిని ప్రకటించింది. కానీ వైవీ ప్రస్తుతం ఎక్కడున్నారు అనేది సందేహంగా మారింది. పార్టీలో అదే చర్చగా మారింది. పది రోజుల నుండి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. మనసు నొచ్చుకుని ప్రస్తుతం కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో అనే చర్చ జరుగుతుంది. నిజానికి వైవీ రాజకీయంలో మొదటి నుండి మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
* 2019 ఎన్నికల ముందు కూడా ఆయన ఒంగోలు ఎంపీ సీటు ఆశించి భంగపడ్డారు. చివరి రోజుల్లో టీడీపీ నుండి మాగుంట వచ్చి ఈ సీటు నుండి పోటీ చేసి గెలిచారు. అప్పట్లోనే వైవీయ చిన్నబుచ్చుకున్నారు. అలకబూనారు. ఎన్నికలకు ముందు మళ్ళీ సమస్యగా మారుతుంది అనే ఉద్దేశంతో పార్టీకి పని చేసారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గా రెండేళ్లు పని చేసారు. ఇటీవల మాత్రం తనకు మంత్రి పదవి కావాలంటూ సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. సొంత జిల్లాలో సొంత శ్రేణులకు దూరమవడంతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినప్పటికీ… సీఎం నుండి సానుకూల స్పందన లేనట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో లాగానే… ఇప్పుడు మరోసారి వైవీకి అనుకున్నట్టు జరగలేదు. అయినా ఆయన జగన్ సొంత మనిషి కాబట్టి రాజీ తప్పడం లేదు..!!