లాక్ డౌన్ సమయంలో కూడా వరుస సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వివాదాస్పద దర్శకుడు ఆర్జివి మరొక చిత్రంతో ముందుకు వచ్చాడు. శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ, సోనియా ప్రధాన తారాగణంగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఆర్జీవి నిర్మించిన సినిమా కరోనా. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అయిన మొట్టమొదటి సినిమా అని దీనిని ప్రచారం చేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథ
ఒక మధ్య తరగతి కుటుంబం లోని ఏడుగురు కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటారు ఇక అందులోని ఇంటి పెద్ద ఆనందరావు (శ్రీకాంత్ అయ్యంగార్), మిగిలిన వారి మానసిక పరిస్థితిని చూపిస్తారు. కరోనా వల్ల వచ్చే భయం, దానివల్ల ఇంట్లో చోటు చేసుకునే పరిణామాలు, గొడవలు, మనస్పర్థలు తర్వాత వీటన్నింటినీ తప్పించుకోవడానికి ఆ కుటుంబం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది…? ఇక వాటి వల్ల వారు పడే కష్టాలు ఏమిటి ఆ తర్వాత కథ ఎలా మారుతుంది అన్నదే క్లుప్తంగా ఈ కరోనా.
ప్లస్ లు
శ్రీకాంత్ అయ్యంగార్ పర్ఫార్మెన్స్
కరోనా వల్ల వచ్చే భయాలను కళ్లకు కట్టినట్లు చూపించడం
జగన్ డైలాగ్స్ పై సెటైర్
ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ లు
ఊహించ దగ్గ కథనం
అసలు ఆసక్తి రేకెత్తించని నరేషన్
సాగే స్క్రీన్ ప్లే
రిపీట్ అయ్యే సీన్లు
విశ్లేషణ
ఈ సినిమాకు శ్రీకాంత్ అయ్యంగార్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఒక మధ్యతరగతి ఇంటిలో పెద్ద గా అందరిని చూసుకుంటూ ఆయన పోషించిన పాత్ర చాలా బాగుంది. వంశీ చాగంటి క్లైమాక్స్ లో ఇచ్చిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో పెద్దగా ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు లేకపోవడం పెద్ద మైనస్. ఇక ఎన్నో నెలలుగా అన్ని కుటుంబాలు ఈ భయాలను బాధలనుభవించేశాయి కాబట్టి ఇప్పుడు ఈ సినిమాను చూస్తే ఎవరికి ఏమి అంత కొత్తగా, ఆసక్తిగా అనిపించదు. కొద్ది నెలల ముందు తీసి ఉంటే… సినిమా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఉండేదేమో. డైరెక్షన్ విషయంలో పెద్దగా మైనస్ లు లేకపోయినప్పటికీ… రెండవ అర్ధ భాగం స్క్రీన్ ప్లే స్లోగా అవుతుంది. ముందు చెప్పుకున్నట్లే కొద్ది నెలల ముందు వచ్చి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా సబ్జెక్ట్ అయ్యేది. ఇక ఇప్పుడు ఖాళీ సమయం లో అలా టైంపాస్ కు చూడవచ్చు.