న్యూఢిల్లీ : దేశంలోనివారంతా కనీసం నాలుగు వందల సంవత్సరాలు జీవించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రామ్దేవ్ ప్రతిపాదించిన జీవన పద్ధతులు అమలు చేయడం ప్రారం భించింది. ఇక మీదట పౌరులంతా బాబా చెప్పినట్లే చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మనిషి శరీరం నాలుగు వందలేళ్లు జీవించేందుకు రూపొందించబడిందని బాబా రామ్దేవ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దరిమిలా మోదీ ప్రభుత్వం బాబాతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి ఆ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ‘చార్ సౌ సాల్ జియో యోజన’ పథకాన్ని (దీనికి రిలయెన్స్ జియోతో సంబంధం లేదు) మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రకారం ఇకపై స్కూళ్లలో బాబా విధానాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం నిర్దేశించింది. బాబా పద్ధతులు పాటించే వారంతా నాలుగేసి వందలేళ్లు బ్రతుకుతారు కాబట్టి అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు ఒక రాజ్యాంగ పునర్లేఖన కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. ఈ అత్యున్నత కమిటీ మంగళవారం సమావేశమై కొన్ని నిర్దిష్టమైన సిఫారసులు కూడా చేసింది.
previous post