ప్రస్తుతం ఐపీఎల్ 2020 మొదలవడంతో క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ‘వీరుకి బైఠక్’ అంటూ సోషల్ మీడియాలో తన అభిమానులను సందడి చేస్తున్నాడు. అయితే ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్ గెటప్ వేసి తన అభిమానులను అలరించారు. ముంబై మ్యాచ్ పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టు పై తీవ్ర విమర్శలు చేశారు.
చెన్నై జట్టును ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కాపాడలేనడని తనదైన శైలిలో సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. అలా వాష్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి చెన్నై జట్టులో పెవిలియన్ చేరడమేంటని అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు మ్యాచ్లలో ఆటగాళ్ళు బంతిని బాత్ ఉంటే ఎంతో సంబరపడి కేకలు వేశాం,కానీ మొన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం బంతి వికెట్కు తగలకుండా ఉంటే చాలని భావించామన్నాడు.
అంతే కాకుండా రెండు జట్లలో ఫిట్నెస్ పెద్దగా లేని ఆటగాళ్లపై కొంచెం సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. గాయం కారణంగా చెన్నై తో మ్యాచ్ కి దూరమైన రోహిత్ శర్మ కి బదులుగా సౌరబ్ తివారి వచ్చారు. బరువు ఫిట్నెస్ రోహిత్ కి ఏమీ తక్కువ కాదనే ఉద్దేశంతో ‘వడా పావ్కు బదులుగా సమోసా పావ్’మ్యాచ్ లో పాల్గొంది అని సెహ్వాగ్ చమత్కారం చేశాడు. అంతేకాకుండా 41 సంవత్సరాలు ఉన్న ఇమ్రాన్ తాహిర్ను అంకుల్ అంటూ సంబోధించాడు. కాగా శుక్రవారం ముంబై తో జరిగిన మ్యాచ్లో చెన్నై గోరంగా పరాజయం చెందింది.
9 వికెట్లకు గాను114 పరుగులు మాత్రమే చేసింది. అందులో సామ్ కరన్ మాత్రమే 52 పరుగులు చేశారు. మంచి ఆటతీరుతో ముంబై అలవోకగా చెన్నై పై విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు 37 బంతుల్లో 6 ఫోర్లు,5 సిక్స్లు చేసి ముంబై చెన్నై పై విజయం సాధించింది.