NewsOrbit

Tag : jagan latest news

బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

siddhu
ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది. హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు. సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు. ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు. హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు....
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

sharma somaraju
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
రాజ‌కీయాలు

ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
న్యూస్

ఏపీ ప్రభుత్వంపై నోబెల్ శాంతి గ్రహీత ప్రశంసల జల్లు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో కైలాస్ సత్యార్థి సమావేశమై పలు...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి సమావేశానికి అయిదుగురు డుమ్మా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌తో...
రాజ‌కీయాలు

రాజధాని మారితే ఆ భవనాలను ఏం చేస్తారు ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ రాజధాని మారితే అమరావతిలోని భవనాలను కూడా ప్రజా వేదికలాగే కూల్చేస్తారా? అని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
టాప్ స్టోరీస్

సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా ఉన్న వైసీపీ ఎంపీ...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
టాప్ స్టోరీస్

పవన్ నిర్ణయంతో నాకేంటి సంబంధం?

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల

Mahesh
అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో పాకిస్తాన్‌ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అయితే, మత్స్యకారులు తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం...
టాప్ స్టోరీస్

‘జగన్‌కు రాజధాని మార్చే హక్కు లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాజమండ్రి: అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ సిఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ...
టాప్ స్టోరీస్

రాజధానిలో పోలీసులకు సహాయ నిరాకరణ

Mahesh
అమరావతి: అమరావతి పరిధిలో శనివారం ఉదయం నుంచి బంద్ వాతావరణం నడుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి నిరసనగా జేఏసీ పిలుపుతో శనివారం బంద్ పాటిస్తున్నారు. రైతులు ఉదయాన్నే...
టాప్ స్టోరీస్

‘కోర్టు విచారణకు హజరుకావాల్సిందే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్,విజయసాయిరెడ్డి కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ 1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
రాజ‌కీయాలు

‘ఈ వివక్షత ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...
రాజ‌కీయాలు

ముగిసిన దేవినేని ఉమ దీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు దేవినేని ఉమ దీక్షను విరమింపజేశారు....
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...
టాప్ స్టోరీస్

ఏపీలో మూడు రాజధానులు!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
న్యూస్

రాజధానిపై మాట మార్చడం ఏమిటి?

sharma somaraju
విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి...
టాప్ స్టోరీస్

గూగుల్‌లో మొనగాడు జగన్.. సోషల్ మీడియాలో బాబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ ఏడాది ముగియడానికి ఇంక ఎక్కువ రోజులు లేదు. 2019లో మన రాష్ట్రంలోని ప్రముఖులలో ఎవరి ప్రభ ఎంతో తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారా. ఇయితే ఇదిగో చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం...
టాప్ స్టోరీస్

జిల్లాకి ఒక టేబుల్..జగన్ విందు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జిల్లాల కలెక్టర్‌లు, ఎస్‌పిలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు.  మంగళవారం తాను ఇచ్చే విందుకు హజరుకావాలని కలెక్టర్, ఎస్‌పిలకు ఆహ్వానాలు పంపారు. విందు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

వివేకా కేసు: సిట్ విచారణకు మాజీ మంత్రి ఆది ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డికి మరోసారి సిట్‌ నోటీసులు పంపారు....
న్యూస్

విద్యార్థులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,...
న్యూస్

జగన్ తో అపోలో ఫ్యామిలీ భేటీ

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డిని అపోలో ఆస్పత్రి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి.. ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా భేటీ...
టాప్ స్టోరీస్

‘జగన్ పాలనకు 150 మార్కులు’!

Mahesh
అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం...
టాప్ స్టోరీస్

ఏపీలో నిరుద్యోగులకు ‘వైఎస్సార్ ఆదర్శం’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. నిరుద్యోగులకు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. ‘వైఎస్సార్ ఆదర్శం’ పేరుతో...
రాజ‌కీయాలు

నవరత్న ఆయిల్ రాశారా శకుని మామా?

Mahesh
అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ...
రాజ‌కీయాలు

‘శకుని మామ మైండ్ బ్లాక్’

sharma somaraju
అమరావతి: బెస్ట్ సిఎం అవుతాడనున్న వాడు కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి శకుని మామ విజయసాయిరెడ్డి మైండ్ పోయిందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు...
రాజ‌కీయాలు

జగన్‌‌కు చంద్రబాబు చురకలు

sharma somaraju
అమరావతి: తప్పును ఎత్తిచూపించే వాళ్ళ నోళ్ళు నొక్కేయాలనుకోవడం వైసిపి ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. వాటిని...