Charging stations : బెంగళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..!! భారతదేశంలో తన నెట్వర్క్ ను శరవేగంగా విస్తరిస్తోంది.. తాజాగా ముంబైలో ఓ కొత్త డీలర్ షిప్ ని ఓపెన్ చేసిన ఏథర్ ఎనర్జీ.. ముంబై మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ల పంపిణీ కూడా ప్రారంభించింది..! అంతేకాకుండా ముంబై లో కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ లను కూడా ప్రారంభించింది..!!
ముంబై నగరంలోని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను లింకింగ్ రోడ్, గోరేగావ్, అందేరి, పోర్ట్ వంటి ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. 2022 నాటికి ముంబై నగరంలో మొత్తం 30 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏథర్ ఎనర్జీ తమ కస్టమర్లకు చార్జింగ్ సౌకర్యాన్ని యాక్సెస్బుల్టీని కల్పించేందుకు అనేక కొత్త కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటుంది.. అంతేకాకుండా ముంబైలోని కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఓనర్స్ అసోసియేషన్ తో కలిసి అపార్ట్మెంట్స్, భవనాలకు హోమ్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించడానికి కూడా కృషి చేస్తోంది. అపార్ట్ మెంట్ లో నివసిస్తూ ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొనే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఇదొక చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది..
ఈ చార్జింగ్ స్టేషన్లను ఏథర్ గ్రిడ్ యాప్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు.. ఈ యాప్ సాయంతో దగ్గర్లోని ఏథర్ చార్జింగ్ స్టేషన్లను గుర్తించడం సులువవుతుంది. ఏథర్ ఎనర్జీ ఇప్పటివరకు దేశంలోని 18 నగరాలలో 128 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు..