4జి సేవలను తక్కువ ధరకు అందించి టెలికం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన జియోకు మెల్లమెల్లగా షాక్ తగులుతుంది. తక్కువ సమయంలో సరసమైన ఆఫర్లను ఇచ్చి భారీ స్థాయిలో యూజర్లను జియో సొంతం చేసుకుంది. కరోనా లాక్ డౌన్ కంటే ముందు భారీగా వినియోగదారులను తనవైపు మళ్లించుకున్న జియో.. అక్టోబర్ ముందు వరకు టాప్ పొజీషన్ లో కొనసాగింది. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలలో తొలి స్థానాన్ని కోల్పోయింది జియో. మొదటి స్థానాన్ని ఎయిర్ టెల్ చేజిక్కించుకున్నట్టు ట్రాయ్ తెలిపింది.
పటిష్ట నెట్వర్క్ తో పాటు సరికొత్త ఆఫర్లతో 4జి సేవలను అందించిన ఎయిర్ టెల్ అక్టోబర్ నెలకు గాను 36.7 లక్షల మందిని ఆకర్షించింది. తక్కువ కాలంలో ఎక్కువ ప్రసిద్ధి చెందిన జిఓ 22.2లక్షల మంది నూతన యూజర్లను తమ నెట్ వర్కులోకి వచ్చినట్టు ట్రాయ్ వెల్లడించింది. అతిపెద్ద మెర్జింగ్ విఐ(వోడాఫోన్ -ఐడియా) 26 లక్షలకు పైగా యూజర్లను కోల్పోగా. ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎంఎల్ 10 వేల మంది వినియోగదారులను కోల్పోయిందని ట్రాయ్ తెలిపింది.
ఇప్పటివరకు ట్రాయ్ లెక్కల ప్రకారం జియో నెట్ వర్క్ అత్యధికంగా 40.6 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఆతరువాత స్థానంలో ఎయిర్ టెల్ 33 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. 29 కోట్ల వినియోగదారులతో వీఐ మూడవ స్థానంలో, 11 కోట్లతో బిఎస్ఎన్ఎల్ నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. యాక్టీవ్ యూజర్ల ప్రకారం ఎయిర్ టెల్ ప్రథమ స్థానంలో ఉంది. వీఐ రెండవ స్థానంలో ఉండగా జియో, బిఎస్ఎన్ఎల్ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి. యాక్టీవ్ యూసర్లలో ఎయిర్టెల్ నెట్ వర్క్ వినియోగిస్తున్న యూజర్లు 96% నిత్యం ఉపయోగిస్తున్నారు. వీఐ ను 88% కాగా, జియో 78%, బిఎస్ఎన్ఎల్ ను 61% మంది నిత్యం వీటి సేవలను ఉపయోగిస్తున్నారు.