ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ సంస్థలు ఆన్లైన్ సేల్స్ లో నువ్వానేనా అన్నట్టుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ సంస్థ “ప్రైమ్ డే సెల్” పేరిట ఆన్లైన్ లో ఆఫర్లు ప్రకటించగా సరిగ్గా అదే రోజు ప్లిప్ కార్ట్ కూడా “బిగ్ సేవింగ్స్ డేస్” పేరిట సేల్ ప్రారంభించడానికి రెడీ అయింది. సో ఐదు రోజుల పాటు ఈ ఆన్లైన్ వ్యాపారం జరగనుంది. ఈ సెల్ లో ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డు పై కొనుగోలు పై 10 శాతం ఇన్స్తాంట్ డిస్కౌంట్ లభించనుంది. ప్రత్యేకంగా ఈ సేల్ లో ఫ్లిప్ కార్డ్ ఐఫోన్ ఎక్స్ ఆర్ అందరిని ఆకర్షిస్తుంది. దీని ధర 52,500 కాగా బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట చేస్తున్నా సేల్ లో ధర 44,999 కే ఫిక్స్ చేసినట్లు ఆఫర్ పేజీలో ఫ్లిప్కార్ట్ పేర్కొంది.
అంతేకాకుండా ఐఫోన్ ఎస్ఈ2020 ని 36,999 కే విక్రయించనున్నట్లు ఫ్లిప్ కార్డ్ తెలిపింది. అలాగే ఒప్పో రెనో 2 ఎఫ్ ను ధర 5,500 తగ్గింపుతో 17999 కి ఆఫర్ అందివ్వగా…. రెడ్ మీ కే20 ప్రోపై నాలుగు వేలు వరకు డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా మోటో నుంచి వస్తున్న ఫోల్డబుల్ ఫోన్ రేజర్ 2019 పైనా 20 వేల 1,24,999 రూపాయలకు లభించనుంది. రియల్ మీ 6,రియల్ మీ 6ప్రో, రెడ్ మీ8,పోకో యెక్స్2 పంటి ఫోన్ లో పైన కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అందించింది.
ఒక్క మొబైల్ పైన కాకుండా దుస్తులు మరియు ఫుట్ వేర్ ఇంకా ఇతర ఉత్పత్తుల పై డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్లిప్ కార్ట్ సంస్థ పేర్కొంది. కాగా ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ను ఐదు రోజులు ప్రకటించగా అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ రెండు రోజులు ప్రకటించింది. సరిగ్గా ఈనెల ఆరో తేదీ నుండే ఈ రెండు దిగ్గజ సంస్థ లు ప్రకటించిన ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.