అవిటా కంపెనీ అవిటా ఎసెన్షియల్ పేరిట భారత్లో ఓ నూతన ల్యాప్ టాప్ను విడుదల చేసింది. ఇది చాలా తక్కువ ధరను కలిగి ఉండడం విశేషం. ఇందులో ఇంటెల్ సెలెరాన్ ఎన్4000 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. పలుచని బెజెల్ డిజైన్ను కలిగి ఉంటుంది. 14 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇందులో ఉంది. ఈ ల్యాప్ టాప్ 6 గంటల వరకు బ్యాకప్ను ఇస్తుంది.
అవిటా ఎసెన్షియల్ ల్యాప్టాప్ కాంక్రీట్ గ్రే, మ్యాట్ బ్లాక్, మ్యాట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ ల్యాప్టాప్ వినియోగదారులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని, మన్నిక కలిగి ఉందని, ఎలాగంటే అలా దీన్ని వాడుకోవచ్చని అవిటా కంపెనీ తెలిపింది. ఈ ల్యాప్ టాప్ను అమెజాన్లో కొనుగోలు చేయవచ్చు.
అవిటా ఎసెన్షియల్ ల్యాప్ టాప్ ధర రూ.17,990 ఉండగా అమెజాన్లో దీన్ని కొనవచ్చు. అయితే ప్రస్తుతం పండుగ సీజన్ కారణంగా ఈ ల్యాప్టాప్ కేవలం రూ.14,990కే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ విధానంలో దీన్ని కొనవచ్చు. నెలకు కేవలం రూ.706 ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఈ ల్యాప్టాప్ పై 2 ఏళ్ల వారంటీ వినియోగదారులకు లభిస్తుంది.
ఈ ల్యాప్టాప్లో విండోస్ 10 హోం ఓఎస్ను ఇచ్చారు. యాంటీ గ్లేర్ స్క్రీన్ కావడం వల్ల కళ్లపై ఒత్తిడి పడదు. డిస్ప్లే పై భాగంలో 2 మెగాపిక్సల్ వెబ్ కెమెరా ఉంది. 4 జీబీ ర్యామ్ ఉంటుంది. 128 జీబీ ఎస్ఎస్డీ లభిస్తుంది. ఇంటెల్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ 600ను ఇచ్చారు. ఇన్ బిల్ట్ స్పీకర్లు, బ్లూటూత్ 4.0, హెచ్డీఎంఐ, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్ తదితర సదుపాయాలు ఉన్నాయి.