ప్రపంచంలో ఏ భాషను అయినా అలవోకగా నేర్చుకునే నేర్పు భారతీయులకు ఉందని చాలా సర్వేలు తేల్చి చెప్పేశాయి. దీనికి కారణం భగవద్గీత వంటి గ్రంథాలను చదవడమేనట. అయితే వీటిని చదవడమే కాదు.. రాయడం కూడా ఎంత కష్టమో మనకు తెలిసిందే..
అలాంటిది బియ్యపు గింజల మీద రాస్తే.. ? పేపర్ల మీద రాయడమే కష్టం అంటే ఇంకా బియ్యపు గింజల మీదనా.. అంటారా ఏమిటి ?
అవును నిజమేనండి. బియ్యపు గింజలమీదే భగవద్గీతను రాసింది. తను ఎక్కడి వ్యక్తి అని ఆశ్చర్యపోకండి.. తను మన హైదరాబాద్ అమ్మాయే.. మొత్తం 4 వేల 42 గింజలపై భగవద్గీతను రాసి అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది రామగిరి స్వారిక. దాంతో పలువురు ఆమెను అభినందించారు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించింది. అలాగే ఉత్తర ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఆమె ఫస్ట్ యంగ్ ఉమెన్ మైక్రో ఆర్టిస్టుగా కూడా గుర్తింపు లభించింది.
ఈ విజయం సాధించడానికి 150 గంటలు కష్టపడినట్లు స్వారిక చెప్పారు. కేవలం భగవద్గీత మాత్రమే కాకుండా ఉమెన్ ఎంపవర్ మీద చాలా సూక్తులను బియ్యపు గింజల మీద రాసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎల్ ఎల్ బి చదువుతున్న స్వారిక 2016 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుమారు 2 వేల మైక్రో ఆర్ట్స్ రూపొందించారు. తను ఫ్యూచర్ లో జడ్జి అవుతానని.. ఉమెన్ ఎంపవర్ మీద పోరాడుతానని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.