ఇక్కడున్న సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్క కంపెనీ తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కూడా జూలై 2021 వరకు తమ సంస్థకు చెందిన ఉద్యోగులందరూ తమ ఇంట్లోనే ఉండి పని చేసుకునేందుకు అనుమతి కల్పించింది.
అంతేకాకుండా వారి ఇంటిలోనే ఆఫీసు ఏర్పరుచుకోవడానికి వెయ్యి డాలర్ల నగదుని కూడా అందిస్తోంది. అంటే ఇంటిలోనే తనకు సౌకర్యంగా ఆఫీస్ ను ఏర్పరచుకునేందుకు అక్షరాలా 75 వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఫేస్ బుక్ తమ ఉద్యోగులకు అందిస్తోంది.
ఇకపోతే ఇప్పటికే చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఫేస్ బుక్ కూడా వారిని అనుసరించింది. ఈ సంవత్సరం జూలైలోనే గూగుల్ సంస్థ వచ్చే సంవత్సరం జూన్ వరకు తమ ఉద్యోగులంతా ఇంటి నుండి పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా…. ట్విట్టర్ అయితే ఏకంగా తన జీవితకాలం వర్క్ ఫ్రొం హోమ్ చేసుకోవచ్చని వారి ఉద్యోగులకు బ్రహ్మాండమైన అవకాశాన్ని కల్పించింది. కానీ హోమ్ ఆఫీస్ కు నగదు ప్రకటించింది మాత్రం ఫేస్ బుక్ మాత్రమే.