వాట్సాప్ ఖాతాలను కూడా హైజాక్ చేసే కుంభకోణం మొదలైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.సోషల్ మీడియాలో అతి కీలకమైన వాట్సాప్ లో చాలామంది కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకోవడమే కాకుండా దాచుకుంటారు కూడా. ఇప్పుడు ఈ సమాచారాన్ని చోరీ చేసే ముఠా బయలుదేరిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఆన్ లైన్ లో జరిగే మోసాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.
అయితే మోసాలు చేసేవారు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. తాజాగా వాట్సాప్ లో కూడా ఈ తరహా మోసం జరిగిందని పోలీసులు తెలిపారు.ఫేక్ ఐడి ల ద్వారా ఇలాంటి మోసాలకు పాల్పడే వారు వాట్స్అప్ ఖాతాల్లోకి ప్రవేశిస్తారని, తాము వాట్సాప్ సాంకేతిక నిపుణలమని చెప్పుకుంటూ వెరిఫికేషన్ పిన్ వివరాలు కోరుతారని, ఎవరైనా అమాయకులు నమ్మి ఆప్ ఇన్ వివరాలు కానుక చెప్పినట్లయితే తక్షణం ఆ వాట్సాప్ ఖాతాను వారు హైజాక్ చేస్తారని, అందులో ఉన్న సమాచారం అంతా అపహరించుకుపోతారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
వాట్సాప్ గాని మరే సోషల్ మీడియా గ్రూపు గాని ఎప్పుడు వెరిఫికేషన్ పిన్ అడగదని,ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు.ఎవరైనా వాట్సప్ వెరిఫికేషన్ పిన్ అడిగిన పక్షంలో వెంటనే తమకు సమాచారం అందించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.కాబట్టి వాట్సాప్ ఖాతాదారులారా తస్మాత్ జాగ్రత్త!!