WhatsApp: దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి పోటీగా అలాంటి ఫీచర్లతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో వివరించారు. ఈ యాప్ చాలా సురక్షితమని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ కు సంబంధించి నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని పేర్కొన్నారు.
వాట్సాప్ మాదిరిగానే మెసేజింగ్, ఫైల్స్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ ఇతర ఫీచర్లు ఈ యాప్ లో రూపొందించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి చంద్ర శేఖర్ తెలిపారు. ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసింది, ఇప్పటి వరకూ ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాడుతుంటగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
WhatsApp: సందేశ్ యాప్ వివరాలు
యాప్ కు వెబ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటిపి నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఈమెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ప్రైవసీ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు.