Cyber Crime: సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటు అమాయక ప్రజలు మోసపోయేలా చేస్తున్నారు.. ఎవరు చేశారో తెలియని విధంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి.. సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ ప్రొఫైల్ తో బురిడీ కొట్టించి టోపీ వేస్తున్నారు..
Read More: RRR Movie: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీ రీకౌంటర్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్..!!
తాజాగా హైదరాబాద్ బోయినపల్లి చెందిన దిలీప్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు న్యూయార్క్ లో ఉంటున్న తన స్నేహితుడు రమేష్ ప్రొఫైల్ పిక్ తో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. వాళ్ల బాబాయి కరోనాతో ఆసుపత్రిలో చేరారని, అత్యవసరంగా రూ.2 లక్షలు కావాలని, డబ్బులు పంపిస్తే రెండు రోజుల్లో తిరిగి ఇస్తానని మెసేజ్ రావడంతో.. ముందు వెనకా ఆలోచించకుండా వెంటనే డబ్బులు పంపించాడు. కాసేపటి తరువాత రమేష్ ఫోన్ చేసి ఈ విషయమై అడగగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని చెప్పడంతో దిలీప్ మోసపోయానని తెలుసుకున్నాడు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా డబ్బులు కోసం మెసేజ్ చేస్తే వారికి ముందుగా ఫోన్ చేసి కనుక్కున్న తరువాత డబ్బులు వేయాలని సూచిస్తున్నారు. అలాగే వాట్సాప్ లో తమ ఫోటోలు అందరికీ కనిపించకుండా ఉండేందుకు సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవాలి అని అన్నారు. ఫోన్లో మాట్లాడితే ఇష్టపడతారని వాట్సాప్ లో చాటింగ్ ద్వారా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు అని తెలియజేశారు. ఇలాంటి నెంబర్లన్నీ +1 కోడ్ తో వస్తున్నాయి . దీంతో ఇతర దేశాల నెంబర్లని తీసుకొని వెంటనే డబ్బులు పంపిస్తున్నారు. అయితే ఈ ఎకౌంట్ నెంబర్ లన్ని ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలవి కావడం గమనార్హం.. అయితే ఇదంతా అమెరికా కేంద్రంగా జరగడం గమనార్హం. ఇకనైనా ఆఫర్ వచ్చిన ప్రతి లింక్ పై క్లిక్ చేయకుండా సూచిస్తున్నారు. అలాగే వాట్సాప్ ప్రొఫైల్ మీకు తెలిసిన వ్యక్తులు చూసే విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?