ప్రతి దేశంలో ఎన్నికల కనీషన్ ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఖర్చు చేయవలసిన అమౌంట్ ను నిర్దేశిస్తారు. అంతకుమించి ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా వారు శిక్షార్హులు. ఇదంతా అఫీషియల్ గా నే కానీ లోపల మాత్రం వేరేల జరుగుతుంది అని ప్రజలందరికీ తెలిసిందే.
అయితే ఆన్ లైన్ లో మరియు సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేసేవారు మాత్రం వీటి నుండి తప్పించుకునే అవకాశం ఉండట్లేదు. తాము తమ రాజకీయ పార్టీని ప్రమోట్ చేసుకునేందుకు ప్రపంచ దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ ని ఉపయోగించినట్లయితే వారు ఆ ప్రచారానికి ఎంత మొత్తాన్ని ఖర్చు పెడుతుంది బయటపడిపోతుంది.
2018 లోనే దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు తెలిపింది. తమ ప్లాట్ ఫార్మ్ పై కనిపించే యాడ్స్ విషయంలో పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది.
రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల్లో ‘పబ్లిష్డ్ బై’, ‘పెయిడ్ ఫర్ బై’ వంటి డిస్క్లైమర్లను ఇకపై అందరూ చూడొ చ్చని చెప్పింది. ప్రకటనదారుల సమాచారం కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. తాము ‘యాడ్ లైబ్రరీ’పై కూడా పని చేస్తున్నట్లు తెలిపింది.
రాజకీయ ప్రకటనలకు సంబంధించిన అన్ని అంశాలను యూజర్లు అందులో పొందవచ్చని వెల్లడించింది. ఓ యాడ్ పై ఎంత ఖర్చు చేశారు, దాన్ని ఎంత మంది చూశారు? వంటి వివరాలను తెలుసుకోవచ్చని చెప్పింది. అయితే ఇప్పుడు వారు అలా చేసిన వెసులుబాటు లో కొన్ని లూప్ హోల్స్ ఉండడాన్ని ఫేస్బుక్ యాజమాన్యం గుర్తించింది.
ఇక అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ లూప్ హోల్స్ కు సంబంధించి వారి టెక్నికల్ పనిచేస్తుంది కాబట్టి తాత్కాలికంగా ఈ సేవను నిలిపివేస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. అయితే ఇప్పటి నుండే ఈ సోషల్ మీడియా సంస్థను వాడుకొని తన పార్టీను ప్రమోట్ చేసుకుందామనుకున్న రాజకీయ పార్టీల కి కొద్దిగా నిరుత్సాహపరిచే విషయమే ఇది.