ఈ ఆధునిక యుగంలో మనిషి నిత్యావసర వస్తువులలో మొబైల్ కూడా ఒక భాగమైంది. మనిషి తినకుండా కొన్ని గంటలు కూడా ఉండగలుగుతున్నాడు కానీ ఫోన్ లేనిది ఒక క్షణం కూడా గడవదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చి ప్రతి పనిని సులభతరం చేసింది. అలంటి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి దశాబ్దం అవగా ప్రతి ఏడాది ఏదో కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని మరింత స్మార్ట్ గా చేసిన ఫోన్ల గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా ఫోల్డబుల్ డిస్ప్లేతో విడుదలైన ఫోన్లు ఈ ఏడాది మార్కెట్లో విజయాన్ని సాధించారు. వీటిలో ముఖ్యంగా సామ్సంగ్ నుండి జెడ్ ఫోల్డ్2, మైక్రోసాఫ్ట్ నుండి సర్ఫేస్ డియో, ఎల్ జి నుండి జి 8 ఎక్స్ థిన్ క్యూతో పాటు హవాయే, మోటో రేజర్ కంపినీలు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న ఫోన్లను విడుదల చేశాయి. ఇవే కాకా త్వరలోనే ఈ తరహా మొబైల్ వంటి ఫోన్ల తయారీలోకి ప్రముఖ మొబైల్ ఫోన్ల దిగ్గజ సంస్థ ఆపిల్, వివో, షియోమీ వంటి సంస్థలు ప్రవేశించనున్నాయి.
అనంతరం హై రిసొల్యూషన్ కెమెరాలు ఉన్న ఫోన్లు ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడు పోయాయి. వీటిలో ముఖ్యంగా సామ్ సంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, షోయోమి mi10 ప్లస్ లో 108mp హై రిజల్యూషన్ కెమెరాలను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కెమెరాలతో 100ఎక్స్ వరకు జూమ్ చేసిన చిత్రాలను బంధించవచ్చు. ఐ ఫోన్ కూడా 12వ సిరీస్లో లిడార్ సెన్సార్లను తీసుకువచ్చింది. దీని ఉపయోగం తక్కువ లైట్లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. నైట్ తీసుకునే పోట్రైట్ చిత్రాలలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఆపిల్ లిడార్ సెన్సార్ వల్ల మొబైల్ ఫోటోగ్రఫీ అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.