సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్లో కొత్త ఫోన్లను తాజాగా విడుదల చేసింది. పిక్సల్ 4ఎ 5జి, పిక్సల్ 5 పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. పిక్సల్ 5 ఫోన్లో.. 6 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 765జి ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. అందువల్ల 5జి కి సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఒకటి ఇ-సిమ్గా పనిచేస్తుంది.
పిక్సల్ 5 ఫోన్లో.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. వెనుక వైపు 12.2 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు 16 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇచ్చారు. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇందులో ఉంది. యూఎస్బీ టైప్ సి, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లు దీంట్లో ఉన్నాయి.
పిక్సల్ 4ఎ 5జి ఫోన్లో.. 6.2 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 765జి ప్రాసెసర్ను ఇచ్చారు. అందువల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ విడుదలైంది. రెండు సిమ్లను వేసుకోవచ్చు. ఒకటి ఇ-సిమ్ గా పనిచేస్తుంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఇచ్చారు. వెనుక వైపు 12, 16 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.
పిక్సల్ 5 ధర 699 డాలర్లు (దాదాపుగా రూ.51,415) ఉండగా, ఈ ఫోన్ ముందుగా ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, యూకేలలో అక్టోబర్ 15 నుంచి లభిస్తుంది. అలాగే పిక్సల్ 4ఎ 5జి ఫోన్ ధర 499 డాలర్లు (దాదాపుగా రూ.36,705) ఉండగా, ఈ ఫోన్ కూడా అదే తేదీ నుంచి అవే దేశాల్లో ముందుగా లభిస్తుంది. అయితే ఈ ఫోన్లను భారత్లో విడుదల చేయడం లేదని గూగుల్ ప్రకటించింది.