టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 పేరిట ఆ ప్లాన్లు లభిస్తున్నాయి. వీటన్నింటిలోనూ డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అంటే.. ఈ నెలలో అందించే ఉచిత డేటా పూర్తిగా అయిపోకపోతే దాన్ని వచ్చే నెలకు బదిలీ చేస్తారు. దీంతో ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ సౌకర్యాన్ని తమ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అందిస్తున్నాయి. దీంతో జియో కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది.
* రూ.399 ప్లాన్లో 75 జీబీ ఫ్రీ డేటా వస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం అందిస్తారు.
* రూ.599 ప్లాన్లో 100 జీబీ ఉచిత డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం లభిస్తుంది. ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 1 అదనపు సిమ్ను ఇస్తారు.
* రూ.799 ప్లాన్లో 150 జీబీ ఉచిత డేటాను అందిస్తారు. ఇందులోనూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తాయి. 200 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ తో 2 అదనపు సిమ్లను అందిస్తారు.
* రూ.999 ప్లాన్లో 200 జీబీ ఫ్రీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తాయి. 500 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్తో 3 అదనపు సిమ్లను ఇస్తారు.
* రూ.1499 ప్లాన్లో 300 జీబీ ఫ్రీ డేటా ఇస్తారు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 500 జీబీ వరకు డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంటుంది. అమెరికా, యూఏఈలలో అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ను వాడుకోవచ్చు.
పైన తెలిపిన అన్ని ప్లాన్స్లోనూ అమెజన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా వస్తాయి. హాట్స్టార్లో అయితే వీఐపీ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా ఇస్తారు. వీటికి తోడు జియో యాప్స్ ను ఉచితంగా వాడుకోవచ్చు. ఈ నెల 24వ తేదీ నుంచి వినియోగదారులు ఈ ప్లాన్లను పొందవచ్చని జియో తెలిపింది.