మొబైల్ ఫోన్ మన జీవితంలో మరొక కుటుంబసభ్యుడి గా మారిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మన కన్నా వారితో, తోబుట్టువులతో కన్నా ఈ కొత్త కుటుంబ సభ్యుడితోనే ఎక్కువగా కాలం గడుపుతున్నాం. అరచేతి లోని ఆనందాన్ని, ప్రపంచాన్ని చూపిస్తున్న ఈ మొబైల్ ఫోన్ ను కొనేందుకు మీరు సన్నాహాలు జరుగుపుతున్నారా…? అయితే కొద్దిరోజులు ఆగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి ఎవరైనా మొబైల్ ఫోన్ కొనేటప్పుడు మంచి రేటు పెడుతున్నారు అంటే ఫోన్ అప్డేట్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన కరోనా సంక్షోభం వలన భారత్ కు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఎగుమతి చేసే చైనా దేశంలో చాలా రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. ఇక ఉన్న పాత మోడల్స్ ను మరియు స్పేర్స్ ను ను జత చేసి మొబైల్స్ ను మళ్లీ మార్కెట్లోకి వదులుతున్నారు…. అవి కూడా అప్ డేట్ కాదాయె.
మనం చూసుకున్నట్లయితే ఇటీవల రిలీజ్ అయిన రెడ్ మీ నోట్ 9 ప్రో మాక్స్ మరియు నోట్ 9 ప్రో కి వెచ్చించే ధరలో గతంలో చాలా ఎక్కువ ఫీచర్స్ వచ్చేవి. అలాగే ఎమ్ఐ 10 అయితే రూ.50 వేలకు పెట్టారు కానీ దాని రివ్యూస్ చూస్తే కేవలం త్రీ స్టార్ రేటింగ్ ఉన్నాయి. రూ.50,000 ధర కలిగిన మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఏమి దానిలో లేవు లేకపోగా శాంసంగ్ దీ అదే పరిస్థితి. వన్ ప్లస్ మొబైల్ ఫోన్స్ వరుసబెట్టి రిలీజ్ చేస్తున్నా…. అందరికీ అన్నీ బోర్ కొట్టేసాయి. శాం సంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్స్ అయితే ఎటువంటి అప్డేట్స్ లేకుండా సరసమైన ధరలో మంచివి లభించలేదు అని టెక్ గురు ల అభిప్రాయం.
కాబట్టి జియోమీ మొబైల్స్, సామ్ సంగ్ కథ మినహాయిస్తే వివో, ఒప్పో, రియల్ మీ మొబైల్స్ ఉన్న స్టాక్ అమ్ముకునేందుకు చూస్తున్నారు. ధర తగ్గించరు కానీ జమానల నాతి ఫీచర్స్ తో వటిని కొనే అవసరం లేదు అంటున్నారు మన టెక్ బాబులు. ఏదైనా సరే ఈ సమయంలో ఒక మొబైల్ కొనుక్కోవడం మంచిది కాదని…. పరిస్థితి మెరుగుపడిన తర్వాత కొత్త ఫోన్లు…. అధిక ఫీచర్లతో చౌక ధరలకే లభిస్తాయని…. కాబట్టి ఓపిక పట్టడం మేలని నిపుణుల సలహా.