మోటోరోలా కంపెనీ భారత్లో మోటోరోలా జడ్ఎక్స్2 సిరీస్లో నూతన స్మార్ట్ టీవీలను శుక్రవారం విడుదల చేసింది. 32 ఇంచుల హెచ్డీ, 40 ఇంచుల ఫుల్ హెచ్డీ, 43, 55 ఇంచుల 4కె ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేశారు. వీటిల్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఇచ్చారు. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫీచర్లు వీటిల్లో లభిస్తున్నాయి.
4కె టీవీల్లో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ లభిస్తుంది. రేజర్ థిన్ డిజైన్, ఎండ్ లెస్ డిస్ప్లేలతో వీటిని తీర్చిదిద్దారు. వీటిల్లో 1.5 గిగాహె్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ బ్యాండ్ వైఫైని అందిస్తున్నారు. 32, 40 ఇంచుల మోడల్ టీవీలలో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉండగా, 43, 55 ఇంచుల మోడల్ టీవీలలో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను అందిస్తున్నారు.
మోటోరోలా జడ్ఎక్స్2 32 ఇంచుల హెచ్డీ టీవీ ధర రూ.13,999గా ఉంది. 40 ఇంచుల మోటోరోలా జడ్ఎక్స్2 ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ.19,999గా ఉంది. మోటోరోలా రెవో 43 ఇంచుల అల్ట్రా హెచ్డీ టీవీ ధర రూ.30,999గా ఉంది. 55 ఇంచుల 4కె టీవీ ధర రూ.40,999గా ఉంది.
ఫ్లిప్కార్ట్లో అక్టోబర్ 16వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించనున్న విషయం విదితమే. అయితే ఆ సేల్కు ఒక్క రోజు ముందుగా.. అంటే.. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ టీవీలను ఫ్లిప్కార్ట్ సైట్లో విక్రయించనున్నారు.