మోటోరోలా కంపెనీ ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విడుదల చేస్తూనే ఉంటుంది. మోటోరోలా ఫోన్లు మన్నికకు, నాణ్యతకు పెట్టింది పేరుగా మారాయి. అవి ఎక్కువ రోజుల మన్నికగా ఉండడమే కాదు, మోటోరోలా ఫోన్లకు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే మోటోరోలా కంపెనీ కొత్తగా ఇ7 ప్లస్ అనే ఫోన్ను విడుదల చేసింది. ఇందులోనూ పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
మోటోరోలా మోటో ఇ7 ప్లస్ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. ఇందులో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ ఉంది. కేవలం 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లో మాత్రమే ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. కానీ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్లను ఇందులో ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం దీంట్లో ఉంది.
వెనుక వైపు 48, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. రెండు 4జి సిమ్లను వేసుకోవచ్చు. బ్లూటూత్ 5.0ను అందిస్తున్నారు. అలాగే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
మోటోరోలా మోటో ఇ7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,499 ఉంది. ఈ నెల 30 నుంచి ఈ ఫోన్ ను ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయవచ్చు.