మన అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని మలుచుకుంటున్నాము.. ముఖ్యంగా కార్ల విషయంలో టెక్నాలజీ లో వస్తున్న మార్పులు డ్రైవర్ తో పాటు ప్రయాణికులను కూడా సురక్షితంగా ఉంచుతున్నాయి..
ఆటోమోటివ్ రంగంలో నిత్యం కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి.. మనిషి డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా వారిని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, అనుభవంను అందించేందుకు ఆటోమొబైల్ ఇంజనీర్లు కొత్త కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంటారు.. ఆటోమోటివ్ రంగంలో పాపులరైన టెక్నాలజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…!
వైరస్ ప్రొటెక్షన్ :
మహమ్మారి కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది.. కరోనా కారణంగా బస్సులు, ఆటోలో ప్రయాణం చేయడానికి జనాలు ఆలోచిస్తున్నారు.. కార్లో అయితే సులభంగా ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. వైరస్ ప్రొడక్షన్ ఉన్న కార్లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. కొన్ని కంపెనీలు ఎయిర్ ప్యూరిఫైర్ లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకప్పుడు లగ్జరీ కార్ కి పరిమితమైన వీటిని ప్రస్తుతం సాధారణ కార్లలో సైతం అందుబాటులోకి తెచ్చారు..
ఇన్ఫోటైన్మెంట్ సిస్టం :
స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు కార్ లో అత్యంత అవసరమైన ఫీచర్స్ లో ఇది ఒకటి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్లే టెక్నాలజీ రూపొందించాయి. ప్రస్తుత యువత కు అనుగుణం మొబైల్ కంపెనీలు కూడా తమ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్లే కు సంబంధించిన యాప్ ను డిఫాల్ట్ గా అందిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్స్ ను రిసీవ్ చేయడం, తిరస్కరించడం, వినోదం కోసం బ్లూటూత్ సాయంతో పాటలను వినవచ్చు. అంతేకాకుండా గూగుల్ మ్యాప్ ను కూడా ఎంచుకోవచ్చు.
టచ్ స్క్రీన్ :
ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న కార్లలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం సాధారణమైపోయింది. ఇంతకు ముందు బట్టన్ రూపంలో ఉండేది. ప్రస్తుతం వాటి స్థానంలో కి టచ్ స్క్రీన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇది కారు డాష్ బోర్డు స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా మరింత హుందా ను ఇస్తుంది.
యాంటీ కొల్లాజెన్ :
ఇది ప్రస్తుతం హై ఎండ్ కార్లలో మాత్రమే పరిమితం చేయబడింది. జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి డ్రైవర్ను అప్రమత్తం చేయడమే ఈ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత. ఇది 360 డిగ్రీల కెమెరాను, రాడార్ వ్యవస్థను, చుట్టుపక్కల పరిస్థితులను, ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రమాదాన్ని దరిచేరని ఇవ్వకుండా చూస్తుంది..
రిమోట్ యాక్సెస్ :
జియో ఫెన్సింగ్, టెలిమటిక్స్, రిమోట్ యాక్సెస్ వంటి అనేక కొత్త ఫీచర్లు కారును సురక్షితంగా ఉంచుతాయి. ఎవరైనా దొంగలు దొంగలిస్తే జియో ఫెన్సింగ్ సాయంతో అది ఎక్కడుందో గుర్తించవచ్చు. అలాగే గ్లోస్టర్ అటనమస్ వాటి రిమోట్ సాయంతో పార్కింగ్ చేసుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?