ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా 11 సంత్సరాల తరువాత మళ్ళీ ల్యాప్ టాప్ అమ్మకాలను ప్రారంభించింది. త్వరలోనే ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపింది. మంచి ఛార్జింగ్ కెపాసిటీతో పాటు అతి తక్కువ బరువుతో పాటు మరించి ఫిచర్స్ జోడించి మార్కెట్లో విడుదలకు సిద్ధమైంది. 2009వ సంవత్సరంలో బుక్ లెట్ 3G తర్వాత ఇప్పుడు భారతీయ లాప్ టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది నోకియా. ఈ సంవత్సరం షియోమీ కూడా అతి తక్కువ ధరలకే లభించే లాప్ టాప్స్ ను విడుదల చేసింది. భారతదేశంలో సుమారు 3.4 మిలియన్ పిసిలు రవాణా చేయబడ్డాయి, ఇది సంవత్సరానికి 9.2% వృద్ధిని సాధించిందని మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఐడిసి తెలిపింది. నోకియా ప్యూర్ బుక్ ఎక్స్ 14కు సంబందించిన వివరాలు తెలుసుకుందాం.
నోకియా ప్యూర్ బుక్ ఎక్స్ 14 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లేతో పాటు డాల్బీ విజన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ఇందులో ప్రీ ఇన్ స్టాల్ తో పాటు, పెద్ద టచ్ ప్యాడ్తో సన్నగా ఈ ల్యాప్ టాప్ ను తయారు చేశారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 86 శాతంగా ఉండగా, బ్రైట్ నెస్ 250 నిట్స్గానూ, వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగానూ ఉంది. ఇంటెల్ కోర్ i5 పదో తరం ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రా హెచ్డీ 620 గ్రాఫిక్స్ను ఇందులో అందించారు. అంతే కాదు 4కే సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు ఇంటెక్ క్విక్ సింక్ వీడియో, ఇంటెల్ ఇంట్రూ 3డీ టెక్నాలజీ, ఇంటెల్ క్లియర్ వీడియో హెచ్డీ టెక్నాలజీలను ఇందులో పొందుపరచారు.
సన్నగా రూపొందించబడ్డ ఈ లాప్ టాప్ లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ముందెన్నడూ లేని విధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 5.1, రెండు USB 3.1 పోర్టులు, ఒక USB 2.0 పోర్టు, ఒక USB టైప్-C 3.1 పోర్టు, హెచ్డీఎంఐ పోర్టు, ఆడియో ఔట్, మైక్ ఇన్ పోర్టు కూడా ఇందులో ఇన్ బిల్ట్ అయివున్నాయి. బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. ఫేస్ అన్ లాక్, బ్యాక్ లైట్ కీబోర్డు, మల్టీపుల్ గెస్చర్లను సపోర్ట్ చేసే టచ్ ప్యాడ్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని మందం 1.68 సెంటీమీటర్లు కాగా, బరువు 1.1 కేజీగా ఉంది. భారతీయ లాప్ టాప్ మార్కెట్లో నోకియా ప్యూర్ బుక్ ఎక్స్14 ధరను రూ.59,990గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆర్డర్లు ఫ్లిప్ కార్ట్లో త్వరలోనే ప్రారంభం కానున్నాయి.