వన్ప్లస్ సంస్థ వన్ప్లస్ వై1, యు1 సిరీస్లో నూతన ఆండ్రాయిడ్ టీవీలను భారత్లో విడుదల చేసింది. వన్ప్లస్ యు1 55 ఇంచుల మోడల్లో.. 4కె డిస్ప్లే, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10, ఆండ్రాయిడ్ టీవీ 9.0, ఇన్బిల్ట్ గూగుల్ అసిస్టెంట్, వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ, డాల్బీ అట్మోస్ ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర రూ.49,999గా ఉంది.
వన్ప్లస్ వై1 సిరీస్లో 32, 43 ఇంచుల మోడల్లో రెండు టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హెచ్డీ, ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 9.0, ఇన్బిల్ట్ గూగుల్ అసిస్టెంట్, వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ, డాల్బీ ఆడియో ఫీచర్లను అందిస్తున్నారు. 32 ఇంచుల టీవీ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల టీవీ ధర రూ.22,999గా ఉంది.
అమెజాన్లో ఈ కొత్త వన్ప్లస్ టీవీలను జూలై 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అందుకు ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. త్వరలో వన్ప్లస్ ఎక్స్పీరియెన్స్ స్టోర్స్లోనూ ఈ కొత్త టీవీలను విక్రయించనున్నారు. ఈ టీవీలలో యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఈరోస్ నౌ, హంగామా, జియో సినిమా, జీ5 వంటి స్ట్రీమింగ్ యాప్స్ను ఇన్బిల్ట్గా అందిస్తున్నారు.