ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ ఒప్పో తన మొదటి 5G ఇన్నోవేషన్ ల్యాబ్ను తన స్వదేశమైన చైనా వెలుపల మొట్టమొదటి సారి ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త 5జి ల్యాబ్ ను భారతదేశంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. త్వరలోనే భారత దేశమంతా 5జి సేవలు విస్తరించనున్న నేపథ్యంలో ఒప్పో ఇండియాలో ప్లాంట్ నెలకొల్పడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
నూతనంగా ప్రారంభిస్తున్న ఈ ల్యాబ్ ఆ దేశంలో ఉన్న ల్యాబ్ తర్వాతది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో మంచి పేరున్న ఒప్పో ఈ ప్లాంట్ ఏర్పాటుతో తన మార్కెట్ విలువ పెంచుకునే అవకాశం ఉందనే చెప్పవచ్చు. ఈ ల్యాబ్ లో కెమెరా, పవర్ మరియు బ్యాటరీ మరియు దాని స్మార్ట్ఫోన్ ల పనితీరుతో సహా పరిశోధన మరియు స్పేర్ పనితీరును పరీక్షించనున్నారు. భారతదేశంలో ఈ ప్లాంట్ పెట్టడం ద్వారా తన వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న సంస్థగా ఒప్పో పేరు పొందనుంది.
చైనా యాప్ లను ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేదించగా, ఇండో -చైనాల మధ్య రాజకీయ ఘర్షణలు జరుగుతున్న వేళా ఈ ప్రకటన రావడం విశేషం. ఇది చైనాతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. త్వరలోనే రిలయన్స్ జియో దేశంలో 5G సేవలను అందించే మొట్టమొదటి స్థానిక టెలికం ఆపరేటర్ గా మారనున్న వేళా ఒప్పో 5జి ప్లాంట్ విస్తరించి 5జి మొబైళ్ల అమ్మకాలు పెంచుకునే ప్రయత్నలనే చెప్పవచ్చు. దీనిపై ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెడ్ మాట్లాడుతూ స్వంత దేశం తర్వాత ఒప్పో విదేశాలలో నెలకొల్పిన మొదటి 5G ల్యాబ్ అని తెలిపారు. ఈ ల్యాబ్ లో 5G సేవలను, టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. అంతే కాదు భారతదేశంలో 5G సేవల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు.